In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, May 27, 2015

శరణాగతి - బాబా అనుగ్రహం



పరమ గురువులు మనకు అనుభూతుల రూపంగా బోధలు చేస్తారు. వారు మనకు వాటి గురించి డైరెక్ట్‌గా నోటితో చెప్పకపోవచ్చు. కాని మన జీవితంలో మాత్రం జ్ఞానమనే వెలుగు వెలుగుతుంది. మనకు కావల్సినదల్లా  ఆ గురువు పట్ల భక్తి శ్రద్ధలు. బాబా, భగవంతుడు ఎవరు ఎక్కడ ఉన్నారు అన్న విషయాలను అనుభవపూర్వకంగా మనకి నేర్పిస్తారు.

భగవంతుడు అంతటా, అన్ని చోట్లా ఉన్నాడన్న సత్యాన్ని మనకి నేర్పించేందుకే ఆయన వివిధ రూపాలలో దర్శనం ఇచ్చారు. అట్లానే జంతువుల్లో కూడా నేనున్నాను అని చాలా సార్లు చూపించడం జరిగింది. సరే గురువులు బోధించే ఈ అనుభవాన్ని మనము ఎట్లా పొందాలి, ఏం చెయ్యాలి?

మనము భగవంతుడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే దానికి కొంచెం కృషి చెయ్యాలి. దానికి భక్తి కావాలి. మనం కోరుకునేది అత్యంత శాశ్వతమైనది. కాని మన కోర్కెలు కారణంగా దేవుడ్ని కూడా పరిమితం చేస్తాము. మన జీవితంలో ఎంత భాగం దేవుని సేవకు కేటాయిస్తాము . సరే మనము భక్తులము మనకి ఆ భగవంతుని మీద శ్రద్ధ ఉండవచ్చు.

భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు అనేది మన శాస్త్రాలు ఇలా చెప్పాయి.

1) భక్తునకు దేవుడి మీద బాగా నమ్మకం ఉంటుంది.
వీరు చాలా భక్తితో దేవుడ్ని సేవిస్తారు. వాళ్ళు ఒక ఇష్ట దేవతను బాగా కొలుస్తారు. వాళ్ళకి వాళ్ళ ఇష్ట దేవత తప్ప మిగతా సంప్రదాయాల్ని ఇష్టపడరు. ఒక్కోసారి వాటిని విమర్శిస్తారు కూడా. భగవంతుడి యొక్క శక్తులను పొగుడ్తారు. వీరు మొదటి తరగతి.

2) భగవంతుడు ఒక్కడే అని నమ్మే భక్తులు :
భక్తునకు కొద్దిగ జ్ఞానం కలిగితే గురుకృపతో ఒక్కడే భగవంతుడు, ఆయనకు రూపము, పేరు లేదని తెలుసుకుంటాడు. భగవంతుడు వేరు వేరు రూపాల్లో ఉన్నా, ఒక్కడే అన్నింటిలో కనిపిస్తాడు అని అనుకుంటారు. మొదటి వాళ్ళతో చూస్తే, వీళ్ళు వేరు సంప్రదాయాల్లో ఉన్నవారు తప్పుదారిలో లేరు అని అర్ధం చెసుకుంటారు. వీరు భగవంతుడే సృష్టికి మార్గం చూపిస్తాడు అంటారు.

3) వీళ్ళకి భక్తి ఉందని చెప్పడం కాదు వాళ్ళే భక్తి అవుతారు :
ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రపంచం కనిపించదు. వాళ్ళకి దైవస్వరూపం ఒక్కటే కనిపిస్తుంది. వాళ్ళు ఏ కర్మను ఆచరించినా అది భగవదర్పితమే.

ఈ మూడు తరగతులు కూడా గొప్పవే. కాని మన గమ్యం ఎటు అనేది వేరే చెప్పనవసరంలేదు. కాని మన మనస్సు మన మీద చాలా ట్రిక్స్ చేస్తుంది. వాటికి ఒక్కోసారి మనం బానిసలమవుతాము. దాన్ని గుర్తించలేము. మనము ఈ చివరి స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించాలి. మన వంతు కృషి మనము చెయ్యాలి.

అందుకే మనకు బాబా నవవిధభక్తి మార్గాన్ని కూడా బోదించడం జరిగింది. ఇదే ప్రహ్లదుడు మనకి చేసి చూపించాడు. బాగవతంలో ప్రహ్లదుడు ద్వారా ఈ నవవిధభక్తిని మనకి ఇవ్వడం జరిగింది. ఆయన చిట్టచివరి స్థాయిలో ఉండి, బాధల్ని కూడా విష్ణు స్వరూపంగా చూసిన మహాభక్తుడు. అందుకే హిరణ్యకశ్యపుడు ఎన్ని బాధలు పెట్టినా ప్రహ్లదుడ్ని ఏమీ చెయ్యలేకపోయాడు. ఇక్కడ ప్రహ్లదుడు అంతా విష్ణువు తప్ప ఇంకేమి లేదన్న భావాతీత స్థితికి ప్రతీక. అదే బాబా మనకి నేర్పాలని చూస్తారు. అందుకే ఆయన చెప్పేవారు. ఆయన లాంటి శిష్యుడి కోసం చూస్తున్నానని ఆయన తన గురువుతో ఎలా ఉన్నారో అన్నది ఈ భక్తికి ప్రతీక కూడా.

ఒకసారి  ఒక భక్తుడు ప్రయాణం చేస్తూ ఒక లోయలో కాలు జారి పడ్డాడు. భగవంతుడిని ప్రార్ధిస్తూ, ఒక కొమ్మ దొరికితే పట్టుకుంటాడు. భగవంతుడ్ని రక్షించమని ప్రార్ధిస్తాడు. అప్పుడు భగవంతుడు కనిపించి, ఆ కొమ్మను వదిలేయి నేను రక్షిస్తాను అంటారు. కాని భక్తుడికి దైర్యం చాలలేదు. పూర్తి శ్రద్ధ లేదు, నమ్మకం లేదు, మనము ఆ పరిస్థితిలో ఉంటే ఏమి చేస్తాము?

మనము మాయ అనే లోయలో పడి సంసారం అనే కొమ్మను పట్టుకోని వేలాడుతూ ఉండక, బాబా నేర్పిన శ్రద్ధ, సబూరి మార్గంలో పయనిద్దాం.

శ్యామా శరణాగతి:
ఒకసారి శ్యామాని ఒక పాము కరుస్తుంది. విషము బాగా నర నరాల్లో పాకుతుంది. వాళ్ళ ఆచారం ప్రకారం పాము కరచిన వారిని ఆ ఊరి గుడికి తీసుకువెళ్తారు. కాని శ్యామా దానికి ఒప్పుకోలేదు. చావు అయిన బ్రతుకు అయినా బాబానే నా దేవుడు అని గట్టి నమ్మకంతో చెప్పాడు. అప్పుడు ఆయన్ని బాబా దగ్గరకి తీసుకురావడం జరిగింది. బాబా శ్యామాని బతికించడం అంతా మనకి తేలిసినదే.  శ్యామా మహానుభావుడు. అంతటి నమ్మకం, భక్తి మనకి కూడా రావాలి.



|| ఓం సాయిరాం ||

Wednesday, May 13, 2015

భగవంతుడు ఎవరు?




ఒకసారి నానా చందోర్కరు బాబాని ఈ క్రింది విధంగా ప్రశ్నలు అడగటం జరిగింది. ఏమిటా ప్రశ్నలు.

భగవంతుడు ఎవరు?

ఎక్కడ ఉంటాడు?

ఆయనను ఎట్లా చూడాలి?

భగవంతుడు ఎలా ఉంటాడు?

ఈ ప్రశ్నలకు బాబా ఇట్లా సమాధానం చెప్పారు.
బంధాలతో విషయ వాంచలతో ఉన్నవారు మంచి చెడుల గురించి తెల్సుకోలేరు అట్లానే భగవంతుడ్ని అర్ధం చేసుకోలేరు. వాళ్ళకు మానవత్వం బహు తక్కువగా ఉంటుంది. ధర్మమార్గం తెలియదు. ఎప్పుడూ ఈ ప్రపంచం అనే సాగరంలో మునిగి శాస్త్రాలపట్ల, సంతుల పట్ల శ్రద్ద లేక బతుకుతూ ఉంటారు. వారు భగవంతుని కాక నరకానికి చేరుకొంటారు.

ముముక్షువులు బంధాలతో విసిగి, వివేక విచారములతో, సదా భగవంతుడినే కోరుకుంటారు. వాళ్ళు తప్పకుండా ధర్మమార్గంలో నడుస్తారు. వీళ్ళే సాధకులై, జాగరూకులై, భగవంతుని స్మరిస్తూ తపోధ్యానాదులతో జీవనాన్ని సాగిస్తారు. భగవంతుడి నుంచి ముక్తి తప్ప వేరేమి కోరుకోరు. వారికి నేను గురువు రూపంలో ఉండి ఈ శరీరం వాళ్ళది కాదు అని, వారిలోనే పరమాత్ముడు ఉన్నాడని అనుభవపూర్వకంగా తెలియచేస్తాను.

అప్పుడు వారికి భగవంతుడు సర్వవ్యాపి అని, అన్ని రూపాలలో తనే ఉన్నాడన్న అనుభవం కల్గుతుంది. కదిలేవి, కదలనివి అంతా దేవుడే అని వారికి అనుభూతి అవుతుంది. దేవుడు లేని స్థలము లేదని అర్ధం అవుతుంది. కాని మాయ అనే తెర వలన ఇది చాలా కష్టం అనిపిస్తుంది. ఆ మాయను కేవలం గురుకృప ద్వారా మాత్రమే దాటగల్గుతాము. గురువు పట్ల శ్రద్ద, ఆ తరువాత ఈ కర్మలను నశింప చేసుకొనే దాకా ఓర్పు కలిగి యుండాలని బాబా చెప్పడం జరిగింది.

భగవంతుడు సర్వవ్యాపి అని, అందరిలో భగవంతుడిని చూడమని మనము యుగయుగాలుగా వింటూనే ఉన్నాము. కాని ఈ సత్యం మన మనస్సులోతుల్లోకి ప్రవేశించలేకపోతుంది.

ఈ అనుభూతిని మన నిజ జీవితంలో పొందలేకపోతున్నాము. మరి ఎట్లా? ఏ మార్గంలో వెళ్ళాలి!

అందుకే బాబా మనకి సులభమైన మార్గం చెప్పటం జరిగింది. ఆయన ఎల్లప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూ, భగవంతుడే మనకు దారి అనే తత్వాన్ని బోధించారు. కేవలము శ్రద్ధ, సబూరితో మాత్రమే మనము ఈ గమ్యాన్ని చేరుకోగల్గుతాము.

ఉదాహరణకి మనం చిన్నప్పుడు కొన్ని మాటలు తప్పు వ్రాసినప్పుడు మన టీచర్స్ మన చేత కాంపోజీషన్ వ్రాయించేవారు. దాని మూలాన మనకు ఆ తప్పుని దిద్దుకొనే అవకాశం కల్గింది. అట్లానే కేవలము భగవంతుని యొక్క స్మరణతో ఈ కలియుగంలో ముక్తిపథం వైపు నడవచ్చు.

ఏదైనా సాధన ద్వారా మాత్రమే సాద్యపడుతుంది. ఈ సాధనలో మనకు మార్గదర్శి కావాలని బాబా చెప్పడం జరిగింది. లేకపోతే ఈ అరణ్యంలో మనము దారి తప్పుతాము. ఈ మాయ మనల్ని మింగేస్తుంది.

ఈ సర్వవ్యాపకత్వం మనకు అలవాటు చెయ్యడానికి బాబా వివిధ రూపాలలో దర్శనం ఇచ్చి వారికి వారి కర్మలు, వాసనలు కనుగుణంగా వారిని నడిపించి మార్గదర్శకత్వం చేయడం జరిగింది. కేవలము పరమ గురువులు మాత్రమే ఈ విధంగా మనలను ఉద్దరించ గల్గుతారు. ఏ విధంగా భగవంతుడు (కృష్ణుడు) అన్నింటా ఉన్నాడని విభూధి యోగంలో కృష్ణపరమాత్మ చెప్పడం జరిగిందో అదే బాబా చేసి చూపించారు. ఆయన జంతువుగా వచ్చిన, మనిషిగావచ్చిన, గురువులుగా కనిపించినా, మన ఇష్ట దైవంలా కనిపించినా, ఇలా ఏ రూపముగా వచ్చినా, ఇదంతా మనకు ఈ భావనను అనుభవ పూర్వకంగా చూపించగల పరమదయాళువు మన సాయి పరమాత్మ.




|| ఓం సాయిరాం ||