In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Thursday, September 25, 2014

Prayers to Sai




Prayers to Baba


As Sai devotees we need to gain more Shradda and Sabhuri so that we can live the life that Baba wanted us to lead. 

Every one of us need to realize the real teachings of Baba. The only way we can understand this, is by studying the Sri Sai Satcharita not just reading it.

As Sai devotees we really love Sai, we need to spend our time just thinking about Baba.

1) Let us try to read Sri Sai Satcharita every day.
2) Let us not talk negative about any one.
3) Let us not spend our time with ideal talk.
4) Let us try to see positive in any situation.
5) Let us try to first offer what ever we eat or drink to Baba.

If we try these sadhanas, Baba will take us to the next level in our lives.




OM SRI SAI RAM!
    

Wednesday, September 24, 2014

Spiritual Mind- Teachings to Change Lives




Our mind is nothing but flow of thoughts in the back ground of impressions. These impressions will influence our life. Our thoughts will dictate our wellbeing. Positive thoughts will create positive environment and negative thoughts will lead us into chaos. We think about so many things before we go to bed and we want to implement them next day at any cost. When we get up in the morning, we get lost in the jungle of life. Everybody else control our life. You feel like you do not have a choice and you are dragged in different directions. Work, kids, family will cause exhaustion by the end of the day. We go to bed tired and emotional. Same thoughts, frustration and anger overwhelm you, because you could not control your life.

Baba said “If you get a good thought in the night, ponder over it, when you get up in the morning put that thought in to works. This is the first step in the direction of the truth that is Jnana (knowledge). This is what gives us mental peace”. Baba always encouraged his devotees to implement good thoughts immediately. He never liked laziness and thought of postponing for later period. Lot of times our lazy attitude is the reason why, we can not do what we want to do. So we are obstructing our own life. So we have to put good thoughts in to practice quickly, and leave the result to God’s grace. God always protects us and takes us forward with positive thoughts and good intentions. Baba always provided his blessings and will continue to give us enough patience to carry out those fruitful good thoughts.

Our mind creates our own reality. The Maya (ignorance) covering our thinking makes our reality blurred. Our thinking distorts because of this Maya.

Our thinking dictates our words.


Words will determine our language.

Language in turn makes us behave certain way.

Our behaviors will become our habits.

The habits will create our values.

Values will lead us to our destiny.

So making our thoughts positive will change every thing we experience in our lives. Our mind, thoughts, emotions, expectations and behaviors actually create our reality.

If we have negative thoughts, we will invite more of a negative energy. If we think positive we will imbibe positive energy.

Medical studies point out that a positive thought will increase our immunity by 5 hours and similarly a negative thought will reduce our immunity by 5 hours. We will have to make a choice here! Please let us not destroy our lives by negative thoughts. Let’s be positive.


OM SRI SAI RAM!

Wednesday, September 17, 2014

మంచిని పెంచు - నిజ జీవితానికి సాయి బోధలు


మనస్సు అంటే ఏమిటి ?

వాసనలతో కూడిన ఆలోచనల తరంగమే మనస్సు.

ఈ వాసనలు మన జీవితాన్ని సుడిగుండాలుగా మారుస్తాయి. మన మానసిక పరిస్థితి వీటిమీదే ఆధారపడి ఉంటుంది. 

మంచి ఆలోచనలు మనలో ప్రశాంతతను పెంచుతాయి. 

చెడు ఆలోచనలు మనలను కష్టాలపాలు చేస్తాయి. 

మనం రోజు నిద్రపోయే ముందు మన మనస్సు ఆలోచనల మయం అవుతుంది. వాటిలో కొన్ని మంచి ఆలోచనలు మన జీవితాన్ని మార్చేవి కూడా ఉంటాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెట్టాలి అని అనుకోని నిద్ర పోతాము. ప్రొద్దున్నే లేవగానే ఈ జీవనమనే అరణ్యంలో కొట్టుకుపోతాము. ఎవరెవరో మన జీవితాన్ని నిర్దేశిస్తారు. మన ప్రమేయం లేకుండా రోజంతా గడిచిపోతుంది. ఇంటిపనులు, పిల్లలు, వృత్తి మరియు కుటుంబ వ్యవహారాలతో అలసి పోతాము. ఈ బడలికతో నిద్రకు ఉపక్రమిస్తాము. కాని మళ్ళా అవే ఆలోచనలు. మన జీవితం మన అధీనంలో లేదన్న నిస్పృహ. ఇలా ఒక రకమైన బాధ, కోపం మరియు దైన్య స్థితి ఏర్పడుతుంది. 

బాబా అందుకే ఇలా చెప్పారు. "నీ మనస్సులో ఏదన్నా మంచి ఆలోచన వస్తే, దాన్ని పరిశీలించు, ప్రొద్దున్నే లేచి దాన్ని ఆచరణలో పెట్టు. ఇదే జ్ఞానానికి తోలి మెట్టు. ఇది నీ జీవితంలో శాంతిని ఇస్తుంది". 

ఇలా మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టమని బాబా తన భక్తులను ఎంతో ప్రోత్సహించే వారు. బద్దకం అనేది వదిలించుకొమని చెప్పేవారు. చాలాసార్లు మనం చేసే పనులకు మనమే అడ్డుగా నిలుస్తాము. మనలోని న్యూనతే దీనికి కారణము. దీన్ని అధిగమించవలసిన బాధ్యత మన మీదే ఉంది. 

అందుకే మంచి ఆలోచనను వెంటనే అమలు చెయ్యాలి. దాన్ని రేపటికి వాయిదా వెయ్యకూడదు. వీటిని మనము బాగా పరిశీలిస్తాము. వాటిమీద మంచి అవగాహన కూడా వస్తుంది. కాని దాన్ని అమలు చేయడానికి వెనుకాడతాము. దీనికి మన పక్కన ఉన్న వాళ్ళను అడ్డుగా భావిస్తాము. దాని వల్ల దుఃఖం మరింత ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి మన కుటుంబ సభ్యులు మరియు మన స్నేహితులు నిస్సహాయులు. కాని వారిని నిందిస్తాము. వారివలనే మనకు ఈ కష్టం కలిగినదని భావిస్తాము. 

మనకు మనమే చేసుకోలేనప్పుడు ఇతరులు ఎలా చేస్తారు. మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోవాలి. 

మన మనస్సే మన ప్రపంచం. 

మనస్సుతో మనం ఎలా చూస్తామో, అలానే ఈ ప్రపంచం కనిపిస్తుంది. 

మాయ అనే పొర కప్పినప్పుడు మన ఆలోచనా విధానం సరిగ్గా ఉండదు. 

మనం ఎన్నో జన్మలగా ఈ మనస్సులోని వాసనలకు బానిసలం అయ్యాము. వాటినుంచి బయటపడలేము. 

మన మనస్సు, అందులో చెలరేగే ఆలోచనలు, వాటినుంచి ఉద్భవించే ప్రేమానురాగాలు, ద్వేషం మొదలైనవన్ని మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. 

ఆలోచనలు మాటల రూపంలో బయటకు వస్తే అదే మనం మాట్లాడే భాష  అవుతుంది.  ఈ భాష మనకు ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుంది. ఇది ఒక అలవాటుగా మారి అదే మన జీవన విధానం అవుతుంది. ఈ విధానం మంచిది అయితే మనలో మంచి మార్పులు కలుగుతాయి. లేకపోతే అధోపాతాళానికి తొక్కేస్తాయి. 

ఒక మంచి ఆలోచన మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

చెడు ఆలోచనలు ఈ శక్తిని తగ్గిస్తాయి. 

మరి ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. 

వ్యతిరేక భావనలతో మనము మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. 

అన్నింటిలో మంచిని చూస్తూ మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడమే మన జీవితం యొక్క పరమావధి. ఇది ఎప్పుడు అలవాటు చేసుకుంటామో అప్పుడు బాబా మనకు నేర్పాలనుకున్న సర్వవ్యాపకత్వం మనకు అర్ధం అవుతుంది.




ఓం సాయి రామ్! 

Monday, September 1, 2014

జ్ఞాన జ్యోతి - నిజ జీవితానికి సాయి బోధలు


షిర్డీ సాయి సాకారుడిగా శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలు చేసి మన మనస్సులను మార్చే ప్రయత్నం చెసారు. సాయి నిరాకారుడుగా మన అందరి హృదయాలలో ఉండి మనకు ఎన్నో అనుభూతులను, చమత్కారాలను చూపిస్తూనే ఉంటారు. ఈ సత్యాన్ని మనం ఎప్పటికి మరవకూడదు. 

మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవటం కాదు, మన మనస్సే సాయి నిలయం కావాలి. అప్పుడు కష్టం గురుంచిన ఆలోచనే మనకు రాదు. ఒక వేళ వచ్చినా అది అంతగా మనలను బాధ పెట్టదు. మనం ఈ కష్టాల వలయం వద్దని కోరుకుంటాము, కాని మనం ఆ వలయంలోనే జీవించి ఉండాల్సి ఉంది. మనము ఈ క్షణికమైన జీవితాన్ని, ఈ వలయాన్ని దాటి పరమాత్మ తత్త్వం అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలని సాయి తపన పడుతూనే ఉంటారు. శ్రద్ధ సహనాలనే మంత్రాలతో ఈ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని మనకు బోధ చేసారు. 

బాబా చేసిన చమత్కారాలలో ఉండే ఆధ్యాత్మిక బోధలను మనం అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. వాటిని అర్థం చేసుకుంటే మానవ జన్మ లక్ష్యం ఏమిటో మనకు అవగతం అవుతుంది. ఈ లక్ష్యాన్ని చేరటానికి కావాల్సిన సాధనాసామాగ్రిని మనకు ఇచ్చి, బాబా మన దగ్గరే ఉండి మనలను అనుగ్రహిస్తారు. అటువంటి ఆధ్యాత్మిక అర్ధం ఉన్న చమత్కారమే నీటితో దీపాలను వెలిగించిన సన్నివేశం. కాని దీన్నీ ఒక చమత్కారంలాగా మాత్రమె చూడకుండా దాన్లో ఉన్న అర్ధాన్ని గ్రహించాలి.

ఈ నీటి దీపాల గురించి సాయి సచ్చరితలో ఇలా చెప్పబడింది. 

మొదట్లో సాయి సమర్ధులకు దీపొత్సవమ్ అంటే చాలా ప్రీతి. అందుకోసం వారు స్వయంగా దుఖాణదారుల వద్దకు వెళ్లి నూనెను అడిగేవారు. రేకు డబ్బా పుచ్చుకొని నూనె తెచ్చి దీపాలను వెలిగించెవారు. అలా కొన్ని రోజులు ఆగకుండా ఈ ప్రక్రియ సాగింది. దీపారాదన అన్నబాబాకు బహుప్రేమ. దీపావళి వలె దీపోత్సవాన్ని చేసేవారు. చింకి గుడ్డలతో వత్తులు చేసి మసీదులో దీపాలను వెలిగించేవారు. 

రోజూ ఉచితంగా నూనె అడిగి తెచ్చేవారు. దాంతో వ్యాపారుల మనస్సులో దురాలోచన కలిగింది. అందరూ కలిసి బాబాకు నూనె ఇవ్వకూడదని అనుకోని బాబా వచ్చినప్పుడు నూనె లేదని చెప్తారు. బాబా మౌనంగా తిరిగి వస్తారు. అప్పుడు బాబా ఏమిచేస్తారో అని వాళ్ళందరు వింతగా చూడసాగారు. బాబా మసీదులో ఉన్న రేకు డబ్బాను తీసుకోని దాంట్లో ఉన్న కొంచం నూనేను తాగేశారు. ఆ విధంగా బ్రహ్మాఅర్పణ చేసి ఒట్టి నీటిని ప్రమిదలలో పోశారు. తరువాత ఆ నీటిలో పొడి వత్తులను తడిపి అగ్గిపుల్లను గీచి దీపాలను వెలిగించారు. నీటితో దీపాలు వెలగటం చూసి వర్తకులు ముక్కు మీద వేలు వేసుకున్నారు. మేము బాబాతో అబద్దం చెప్పామని వారిలో వారు అనుకున్నారు. కొంచమైన నూనె లేకుండా నీటితో దీపాలు రాత్రంతా వెలగటం చూసి వర్తకులు సాయి అనుగ్రహానికి పాత్రులు కారని అందరు అనుకొన్నారు. బాబా యొక్క సామర్ద్యం తెలియక తప్పు చేసామని వర్తకులు పశ్చాత్తాప పడ్డారు. కాని బాబా మనసుని జయించిన వారు. వారికి రాగద్వేషాలు ఉండవు. వారికి శత్రువులు మిత్రులూ అంటూ లేరు. వారికి అన్ని ప్రాణులు సమానమే. 


ఈ సన్నివేశం లోని అర్థం


ఈ కథలోని అర్ధాన్ని మనం అర్ధం చేసుకోవాలంటే మనం కాకడ ఆరతి గుర్తు చేసుకోవాలి. మనం ఈ అరతిలో ఈ విధంగా పాడుకొంటాము. 

కాకడ ఆరతి కరీతో సాయి నాథ దేవా!చిన్మయ రూపా దాఖవి ఘేవుని బాలక లఘు సేవా!!

హే సాయి ప్రభూ: నీకు కాకడ హారతి అర్పిస్తున్నాను! పసివాడను అయిన నా సేవను ప్రేమతో స్వీకరించి, నీ చిన్మయరూపం నాకు ద్యోతకం అయ్యేటట్టు చేయి దేవా!!





కామ క్రోధ మద మత్సర - ఆటుని కాకడ కెలా!
వైరాగ్యాచే తూప కాడుని మీతో బిజవీలా!  
సాయి నాథుని గురు భక్తి జ్వలినేతోమీ పేటవిలా! 
తద్ వృత్తి జాలునీ గురునే - ప్రకాశపాడిలా!! 

ద్వైతతమా నాసునీ- మిళవీ తత్స్వరూపి జీవా!!!

అరిషడ్ వర్గాలతో ఉన్న నా మనస్సును ఒత్తిగా చేసి,
వైరాగ్యం అనే నేతితో తడిపి, 
నీ ఫైనున్న అనన్య భక్తి అనే జ్యోతిని వెలిగించాను. 
ఆ కాంతిలో నా గురు దేవుడు ప్రకాశవంతంగా కనిపించారు. 
ద్వైతభావం నశించి, తత్స్వరూపిగా జీవుడు మిగిలాడు.  


ఆధ్యాత్మిక భావం

సాయి మనలను అడుగుతున్నది ఏమిటి?

ఈ జీవన వ్యాపారం చేసే వర్తకులం అయిన మననుంచి సాయి అడిగే తైలం ఏమిటి?

ఈ కథలో లాగా మనమందరమూ నూనె వర్తకులమే. ఇక్కడ నూనె అంటే వైరాగ్యము.

బాబా అడిగేది శ్రద్దా సబూరి మాత్రమే. కాని మనం కూడా ఆ వ్యాపారుల లాగా బాబా అడిగిన దాన్ని ఇవ్వము. 

కాకడ అరతిలో చెప్పినట్లుగా కామ క్రోధ లోభ మోహ మద మాత్స్యర్యములను అరిషడ్ వర్గములను వదులుకోలేము. ఈ ఆరింటిని ఒక వత్తిలాగా చేసి, వైరాగ్యం అనే నేతిలో ముంచి, భక్తి అనే భావనతో ఉన్నప్పుడు సాయి సమర్ధులు ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించితే, ఇక అజ్ఞానమనే అంధకారం తోలిగిపోతుంది. అప్పుడు మన జీవితం జ్ఞానవంతం అవుతుంది. అప్పుడు జీవుడికి ద్వైత భావన తొలిగిపోయి తనే పరమాత్మననే అనుభూతిలో ఉండిపోతాడు. 

మనం బాబా అడిగిన శ్రద్ద సబూరిలను ఇవ్వక పోయినా సాయి మనలను ఎప్పుడూ క్షమిస్తూనే ఉంటారు. 

ఆయన అపర దయామూర్తి. 

అయన కరుణా పూర్వకమైన చూపులే చాలు మనలను జాగృతం చేయడానికి. 

అయన మనలను అనుగ్రహించే ప్రక్రియలో చూపించే సహనం అద్వితీయం. 

ఒక్కసారి మనం కనుక అయన అడిగింది ఇవ్వడం ప్రారంబిస్తే ఇక సాయి అనుగ్రహానికి అంతే ఉండదు. 
సాయి మనలను మన గమ్యానికి చేర్చిందాక వదలరు. 

సాయి ఎలాగైతే నీటితో దీపాలను వెలిగించారో అలానే ఏ అష్టాంగ సాధనల అవసరం లేకుండా  మనకు ఆత్మసాక్షాత్కారం కలగ చేస్తారు. మనకు కావాల్సిందల్లా సాయిఫై అపారనమ్మకం. 

మనలో ఆ తైలం కాస్తంత తగ్గినా, లేకపోయినా కేవలం నీటితోనే మనలో ఆ దీపాన్ని వెలిగిస్తారు. 

అటువంటి నమ్మకాన్ని మనం కలిగిఉందాము. 

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ గురు మార్గంలోనే నడుద్దాం. 

సాయి అనే తారక మంత్రాన్ని గట్టిగా పట్టుకుందాం. 



ఓం శ్రీ సాయి రామ్ !