In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Thursday, December 24, 2020

భగవద్గీత 5. 3 - కర్మ సన్యాస యోగము - నిత్య సన్యాసి




భగవానుడు కర్మ యోగము కర్మ సన్యాస యోగాలను విశ్లేషిస్తూ కర్మ యోగి ఎలా ముక్తుడు అవుతాడు అన్న విషయం ఇలా చెప్పారు.

జ్ఞేయ: స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి  న కాంక్షతి !
నిర్ద్వంద్వ: హి మహాబాహో  సుఖం బంధాత్ ప్రముచ్యతే !!


మహాబాహో! ఎవ్వరినీ ద్వేషింపని, దేనినీ కాంక్షింపని కర్మ యోగిని నిత్య సన్యాసిగా ఎఱుంగవలయును. ఏలనన రాగ ద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసారబంధాలనుండి ముక్తుడగును.

ఇక్కడ కర్మ యోగిని నిత్యసన్యాసిగా చెప్పారు. ఈ సన్యాసి ఎవ్వరినీ ద్వేషింపడు, ఏది కోరుకోడు. రాగద్వేషాలకు అతీతుడు. ఈ స్వభావంతో ఉన్న వారికి సన్యాసాశ్రముతో గాని కర్మ సన్యాసంతో గాని అవసరం ఉన్నట్లు కనిపించదు. మనందరికీ శ్రేయో మార్గ సాధనలో ఇబ్బంది కలిగించే విషయాలు రాగ ద్వేషాలే. వీటివల్లే అనేక సమస్యల్లో చిక్కుకొని సంసార బంధంలో చిక్కుకొని బాధపడతాము. కర్మ యోగి నిష్కామంగా భగవదర్పితంగా తన కర్మలను ఆచరిస్తాడు. అందువల్ల అతడు అనాయాసంగా కర్మబంధములనుండి విముక్తుడవుతాడు. ఇదే భగవత్కృప అని మనం చెప్పుకోవచ్చు. ఇలా కర్మ యోగ అనుసరించక పొతే ఇహపర సుఖాల కోసం తపిస్తూ జననమరణ చక్రంలో నిరంతరం తిరుగుతూ అజ్ఞానంలో ఉంటారు.

సాంఖ్యము, కర్మ యోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని చెప్పుట సరి అయినది కాదని భగవానుడు చెప్పారు. మనం మన స్వభావం బట్టి ఏ దారి ఎంచుకున్నా చివరకు పరమాత్మవైపే తీసుకుపోతుంది. ఒక దారే గొప్ప అనేవారు ఎక్కడకు వెళ్ళరు. వాదవివాదాలు మనిషిని అధోపాతాళానికి తొక్కేస్తాయి.

కర్మ యోగము చక్కగా ఆచరిస్తే అంతః కరణ సుద్ధి కలిగి తత్వజ్ఞానం తనంతట తానే ప్రాప్తించును. ఇక్కడ మనం సాంఖ్యము స్వయానా పరమాత్మ తత్వమే కదా అని అనుకోవచ్చు కాని ఇది మార్గ సాధన మాత్రమే. అందుకే పరమాత్మ ఏ ఒక్క దారి సరిగ్గా ఆచరించినా ఫలితం దక్కుతుంది అని గట్టిగా చెప్పారు. ఇందులో సందేహమే లేదు. కర్మ సన్యాసమనగా కర్మలను చెయ్యకుండా వదిలివేయడం కాదు. అలానే కర్మ యోగమనగా ఏదోవిధంగా కర్మలు చేయడం కాదు.

కర్మ సన్యాసం అంటే సాంఖ్య యోగం, అంటే జ్ఞాన మార్గం.

కర్మ యోగం అంటే ఫలితంపై దృష్టి లేకుండా శాస్త్రవిహిత కర్మలను ఆచరిస్తూ కర్తృత్వం లేకుండా ఉండడం.

ఇలా ఆచరించే వారే నిత్య సన్యాసి. మనకు ఇది సాధ్యమేనా! ఎవరిని ద్వేషించకుండా, ఏది కాంక్షించకుండా ఉండగలమా! ఇలా ఉండడటం కష్టమే అవ్వచ్చు. కాని ధర్మమేమిటో తెలుసుకొని సంఘంలో మనవంతు కర్తవ్యం మనం తప్పకుండా పాటించవచ్చు. మొట్ట మొదట ఎవరిని అనవసరంగా ద్వేషించడం మానేయాలి. మనకు అవసరానికి మించిన వాటిని కోరుకోవడం ఆపేయాలి. ఇలా చేస్తూ ఉంటె ఒక రోజున మనం కూడా నిత్య సన్యాసి స్థితికి చేరవచ్చు. అలాచేరితే పరమపదం అతిచేరువలో ఉంటుంది. 






ఓం శ్రీ పరమాత్మనే నమః! 



Sunday, November 22, 2020

భగవద్గీత 5. 2- కర్మ యోగము - కర్మ సన్యాస యోగము




అర్జునుడు 5వ అధ్యాయం మొదటలో కర్మ యోగము మరియు కర్మ సన్యాస యోగములలో తనకు ఏది శ్రేయస్కరమో చెప్పమని శ్రీ కృష్ణుని అర్ధించాడు. దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు కర్మ యోగమే అర్జునుడికి మంచిది అని బోధ చేశారు. ఈ రెండు దారులు కల్యాణదాయకములే అని చెపుతూ కర్మ యోగము అభ్యాస యోగ్యమైనదని అందుకే అది శ్రేయస్కరమని చెప్పడం జరిగింది.

శ్రీ భగవానువాచ ! 

సన్యాసః కర్మయోగశ్చ  నిశ్శ్రేయసకరావుభౌ !

తయోస్తు కర్మసన్న్యాసాత్  కర్మ యోగో విశిష్యతే !!

కర్మ సన్యాసము, కర్మ యోగము అను ఈ రెండును పరమ కల్యాణదాయకములే. కాని ఈ రెండింటిలోను కర్మ సన్యాసము కంటే కర్మ యోగము సాధన యందు సుగమ మగుట వలన శ్రేష్టమైనది.  


మనకు ఈ రెండు దారులలో ఏది ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి అంటే ఈ రెండిటి మధ్య బేధాలు తెలుసుకోవాలి. ఆ బేధాలను అర్ధం చేసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో అర్ధం అవుతుంది.

 

కర్మ యోగి సాధన సమయమున కర్మలు, కర్మఫలములు, పరమాత్మ, తానూ వేర్వేరని భావించి, కర్మ ఫలమందు ఆసక్తిని త్యజించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయును. 

 

కర్మ సన్యాస యోగి (సాంఖ్య యోగి- ఇక్కడ సాంఖ్యం అంటే జ్ఞానం అని అర్ధం) మాయ వల్ల ఉత్పన్నమైన గుణముల వల్ల మనస్సు ఇంద్రియాలు, శరీరం ద్వారా జరిగే క్రియలన్నిటియందు కర్తృత్వం వదిలి కేవలం సర్వవ్యాపి, సచ్చిదానంద పరమాత్మ యందె భావస్థితుడై ఉండును. ఇక్కడ కర్మ సన్యాస యోగి కర్మలు చేస్తున్నాడు అని కూడా అనలేము. 

 

కర్మ యోగి తన కర్మలకు తననే కర్తగా భావించును. 

సాంఖ్య యోగి తనను కర్తగా భావించడు. 

 

కర్మ యోగి తన కర్మలను భగవంతునకు అర్పణ చేయును. 

సాంఖ్య యోగి మనస్సు, ఇంద్రియముల ద్వారా జరిగే అహంకార రహిత క్రియలను కర్మలుగా భావించడు. 

కర్మ యోగి పరమాత్మను తనకంటే వేరుగా భావించును.

సాంఖ్య యోగి సర్వదా పరమాత్మ యెడ అబేధ భావముతో ఉండును. 

 

కర్మ యోగి ప్రకృతిని, ప్రకృతి యందలి పదార్థముల ఉనికిని అంగీకరించును. 

సాంఖ్య యోగి బ్రహ్మము తప్ప వేరే ఉనికిని చూడజాలడు. 

 

కాని రెండు దారులు చివరకు ఒకటే చోటకు చేరతాయి. అంటే కర్మ యోగి కూడా చివరకు కర్మ సన్యాస యోగి అవుతాడు. కాని రజో తమో గుణాలపై పట్టు సాధించాలి అంటే కర్మ యోగము తప్పదు. చివరకు సత్వ గుణం కూడా వదిలితే కాని కర్మ సన్యాస యోగం కుదరదు. ఇక్కడ సత్వ గుణం అంటే మంచి చేయాలి, అందరికి సహాయ పడాలి అనే కర్తృత్వ భావన. ఇది కూడా ఒక పెద్ద సంసారం అయ్యి కూర్చుంటుంది. అలా అని మంచి పనులు చేయకూడదని కాదు. మన ముందుకు సహాయం అర్ధించి వచ్చిన ఏ ప్రాణికైనా ఆ పరిస్థితులను బట్టి సహాయ పడటం ధర్మం. 

మనమే కల్పించుకొని మరల ఈ ఆధ్యాత్మిక దారినుండి ప్రక్కకు వెళ్ళకూడదు అని గురువులు చెప్తారు. మన కర్మానుసారంగా ఒక వృత్తిలో ఉన్నాము. రోజు చేసే పనులే స్వార్థరహితంగా చేయడమే సేవ అని పెద్దలు చెప్తారు.


ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః!  



Saturday, October 10, 2020

భగవద్గీత 5వ అధ్యాయం - కర్మ సన్యాస యోగము



భగవానుడు 4వ అధ్యాయం ముగిస్తూ అర్జునిని తన హృదయమునందు ఉన్న అజ్ఞానాన్ని వివేక జ్ఞానమను ఖడ్గముతో రూపుమాపి కర్మ యోగమునందు స్థితుడవు కమ్ము అని చెప్పి ముగించారు. ఇప్పుడు 5వ అధ్యాయంలో కర్మయోగము మరియు కర్మ సన్యాస యోగముల గురించి చెపుతూ అర్జునినికి కర్మయోగమే శ్రేయస్కరము అని బోధించారు. ఇక్కడ కర్మసన్యాస యోగము అంటే కర్మను త్యచించడం కాదు. కర్మసన్యాస యోగి అంటే సాంఖ్య యోగి అని అర్ధం. సాంఖ్యం అంటే ఇక్కడ అర్ధం జ్ఞాన మార్గము.

ఈ అధ్యాయంలో మొత్తం 29 శ్లోకాలు ఉన్నాయి. భగవానుడు ఏ మార్గం ఎవరికి అనువుగా ఉంటుంది, మనకి కర్మ యోగము మంచిదా లేక కర్మ సన్యాస యోగానికి మనకు అర్హత ఉందా అనే విషయాలను చక్కగా ఉదహరించి మరీ చెప్పారు. మన మనో స్థితిని బట్టి మనం ఏక్కడ ఉన్నాము అనే విషయం అర్ధం చేసుకుని మన మార్గాన్ని తెలుసుకోవచ్చు. మనకు ముందుగా ఈ మార్గాలు ఎందుకు అనుసరించాలి అనే విషయం అర్ధం కావాలి. 


ఈ మానవ జీవితం ఎంతో శ్రేష్టమైనది అని మన శాస్త్రాలు చెపుతాయి. మనం జన్మరాహిత్యం దిశగా ప్రయాణం చేయాలి అని కూడా చెప్తాయి. ఈ మార్గంలో మనం ప్రయాణిస్తూ కర్మల ఫలితాలు వాసనలు కాకుండా ఎలా ఆచరించాలో ఈ అధ్యాయం నేర్పిస్తుంది. అంతే కాకుండా నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? 

రజో గుణంతో మన మనస్సు నిండి ఉన్నప్పుడు మనం ఆచరించాల్సిన కర్మ యోగం గురించి భగవానుడు చక్కగా చెప్పారు. అలానే సాంఖ్య యోగం (కర్మ సన్యాస యోగి)   అనుసరించాలి అంటే కావాల్సిన అర్హతలు కూడా చక్కగా చెప్పారు. 

భగవంతుడు ఎవరి రాతలు వ్రాయడని వారి కర్మఫలాలను వారే సంచిత కర్మగా తీసుకొని జన్మ తీసుకు వస్తారని ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 

సకామ మరియు నిష్కామ కర్మల గురించి కూడా చక్కగా వివరించారు. అలానే జ్ఞాన యోగము యొక్క ఏకాంత సాధనా విధానాన్ని చెప్పారు. 

ఈ ప్రాపంచిక భోగాలు దుఃఖకారకములని, వివేకవంతులు వీటి పట్ల ఆకర్షణకు లోను కారని, యోగికి సుఖికి గల తేడాలను చక్కగా చెప్పారు. 

చివరగా సాంఖ్య యోగి అంతిమ స్థితి గూర్చి, నిర్వాణ బ్రహ్మ ప్రాప్తి కలిగిన జ్ఞానులైన వారి లక్షణాలు చెప్పి, తానే ఈ విశ్వమంతా ఉన్నట్లు చెపుతూ అధ్యాయం ముగించారు.

చివరగా ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాము.
మనకు కర్మ యోగము మంచిదా లేక కర్మ సన్యాసం మంచిదా అన్న విషయం అర్ధం చేసుకోవాలి. మనందరం  ఈ ప్రాపంచిక విషయాలలో సతమవుతూ ఉంటాము అందుకే కర్మ యోగమే అర్జునిని లాగా మనకు కూడా శ్రేయస్కరము.

ఇక్కడ కర్మ యోగము ద్వారా మనస్సు శుద్ధి పడితే అప్పుడు మనకు కర్మ సన్యాస యోగము చేసే అర్హత వస్తుంది అని అర్ధం చేసుకోవాలి. అందుకే భగవానుడు ఆ యోగి యొక్క లక్షణాలు మనకు చెప్పారు.

మనకు విషయభోగాలు ఎలా అడ్డుగా ఉంటాయో తెలుసుకోవాలి.

మనలో ఉన్న కామక్రోధాల వేగాన్ని ఎలా తట్టుకోవాలో అనే విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు.

కర్మ యోగము ద్వారా మన మనోస్థితిని ఉన్నతంగా తీర్చిదిద్దుకుని, భగవంతుడు అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అర్హత ఎలా సంపాదించాలో నేర్పిస్తుంది ఈ అధ్యాయం.

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః!




Bhagavad-Gita Chapter - 5 Karma Sanyasa yogam

 


The Lord emphasized and encouraged Arjuna to ward off the delusional thinking (Ajnaana) by using the sword of knowledge at the end of Bhagavadgita 4th chapter. In the fifth chapter Lord talks about Karma yoga and karma sanyasa yoga and karma yoga is better for Arjuna. Here Karma sanyasa means not about inaction but it is about sankya yoga (knowledge). It is about path of Jnana and understanding the reality of life. Karma sanyaasa means not inaction but not worrying about the outcome of the action.


The chapter 5 has 29 verses and Lord prescribes a spiritual path that is better for each individual and what are the characteristics of each person who follows these paths. He emphasizes the importance of our mental state and what qualifies us to choose a specific path. 

First of all we all need to understand why we need to follow these paths and why it is essential to have this knowledge. 

Understanding the importance of getting human life and its goal to attain salvation.  These paths provide smooth access to Moksha when we follow these principles with some guidance from a parama Guru.  

This chapter tells us about our actions and how to perform our actions without getting attached to the outcomes of these actions. If we get attached to the outcomes of these actions we get caught up in the whirlpool of impressions.  

We also learn about real knowledge and what path we should follow if our mind is filled with Rajo guna. 

If we want to follow Sankya yoga what are the qualifications that we need to have.  


Lord never wants to dictate the fate of individuals but their fate is based on their past actions. Everyone needs to be cautious about how they conduct themselves in this world. 

In this chapter Bhagavan also describes the differences between Sakama and Nishkama actions. This chapter also talks about the path of knowledge and how to practice this.  

These worldly attractions are the cause for our sorrows and intelligent people stay away from these attractions. He also differentiated the personalities of Yogi and Bhogi. 

In the end he gives the ultimate truth and how a Jnani or self realized person conducts himself in this body or the world.


Salient points to be focused in this chapter

Understanding the differences between Karma Yoga and Karma Sanyasa yoga and how to choose which path is better for us. As we are all immersed in life's hustle bustle, we are better off with Karma yoga as he prescribed this for Arjuna also.


By performing Karma yoga our mind will be purified and then we will be able to grasp the proper knowledge of salvation. Then we will be able to follow the path of Karma sanyasa yoga that is Saankya yoga.


Understanding how the worldly attractions will influence us.


This chapter will make us understand and learn to withstand the impacts of anger and desires.


How to qualify and acquire the qualities of Karma Yogi so that we become eligible to experience the God that is the ultimate truth.



Om Sri Krishna Parabrahmane Namah!

 

Sunday, August 23, 2020

ఆధ్యాత్మిక జీవనం - అవసరం





మన జీవితం సగం నిద్రతోనే సరిపోతుంది. ప్రతిరోజూ ఉదయాస్తమానాలు అవుతాయి. ఆలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి. మిగిలిన జీవితాన్నైనా సరిగ్గా అనుభవించరు. బాల్యంలో క్రీడలు, వయసులో సుఖభోగాలకై పరుగులు మరియు వృద్ధాప్యంలో వ్యాధిగ్రస్తులై పీడింపబడతారు. శరీర పోషణ మరియు మైథునం ఇవే మానవ శరీరానికి సాధనాలైతే, ఈ జన్మకు పర్యవసానం ఇదే అయితే ఈ నర జన్మ వ్యర్థం అని మన శాస్త్రాలు చెప్తాయి. 

మనం ఎవరము, ఎక్కడినుండి వచ్చాము ? ఈ మానవ జన్మకు కారణం ఏమిటి ? అన్న రహస్యం అర్ధం చేసుకున్నవారు వివేకవంతులు. బాల్యం, యవ్వనం, వార్ధక్య అవస్థలు జనులందరికి ఉంటాయి.  కాని అవి ఎలా వచ్చి వెళ్ళిపోతాయో ఎవరు తెలుసుకోలేరు. కళ్ళకు కన్పించేది ఏదైనా నశించేదే. ఈ క్షణంలో ఉన్న శరీరం తరువాత ఉండదు. శరీరం మలమూత్రాలు, శ్లేష్మం చీము రక్తాలతో నిండి ఉంటుంది. దీనిని ప్రతీ క్షణం మృత్యువు వెంటాడుతు ఉంటుంది. ఇలాంటి ఈ శరీరమే మనకు పరమేశ్వర ప్రాప్తిని కూడా కలుగచేస్తుంది. క్షణభంగురమైన ఈ శరీరం పుణ్యం సంపాయించే భగవద్ ఆరాధన, శ్లోకాలు, భగవంతుని కథలు వినే సమయమే సార్ధకం అవుతుంది. 

పరమేశ్వరుని దయతో మనకు కావలసినవన్నీ వచ్చినా ఇంకా మనలో అశాంతే ఉంటుంది. శాశ్వతమైన పరమపదం పొందిన దాకా నిజమైన శాంతి దొరకదు. జీవించడానికి సరిపడా అన్న వస్త్రాలు, తగుమాత్రం ఆలన పాలన చేసి, జనన మరణాలను తప్పించుకోవడమే మానవ కర్తవ్యం.  అందుకే మనం ఈ శరీరాన్ని ఒక అద్దె ఇల్లులాగా చూసుకోవాలి అని గురువులు చెప్పారు. ఇక్కడ ఉన్నంత వరకు దీనిని శుభ్రంగా ఉంచుకొని పరమార్ధం చేరుకోవడానికి తగినంతగా వాడుకొవాలి. 

మనం ఎన్నో జీవరాశులుగా జన్మలు తీసుకొన్న తరువాత కాని మనకు మానవ జన్మ రాలేదు అని శాస్త్రాలు చెప్తాయి. భగవంతుని పొందే అవకాశాన్ని ఈ జన్మలోనే దక్కించుకునే ప్రయత్నం చేయాలి. మరు జన్మకై ఎదురుచూడకూడదు. ఎందుకంటే మళ్ళా మానవ జన్మ ఎప్పుడు వస్తుందో? అందుకే శంకరాచార్యులవారు "జంతూనాం నరజన్మ దుర్లభం" అని చెప్పారు. 

మన కర్తవ్యం ఏమిటో చక్కగా అర్ధం చేసుకోవాలి. మనం జీవితం అనే అరణ్యంలో ఎంత పరుగులు తీసినా దైవాన్ని మరువకూడదు. 

పరమార్ధాన్ని బోధించే శాస్త్రాలను పారాయణ చేయాలి. 

సత్సంగం చేయాలి. 

గురువులను ఆశ్రయించాలి. గురువుల పట్ల శ్రద్ధను పెంచుకోవాలి. 

శరీరం పట్ల అంతులేని వ్యామోహం వదలాలి. ఈ జీవితం క్షణభంగురం. ఎప్పుడు రాలిపోతుందో తెలియదు.  కాలుడు తనపని తాను చేసుకుంటూ పోతాడు. అప్పుడు నాకు ఒక్కరోజు ఎక్కువ ఉంటే బాగుండు అనే బేరసారాలు ఉండవు. ప్రతిక్షణం ఈ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ శరీరంలో ఉన్నంత కాలం ఈ సాధన జరుగుతూ ఉండాలి.

అబేధ జ్ఞానమే తత్త్వం. 

ఉపనిషత్తులలో ఉన్న బ్రహ్మజ్ఞానం ఇదే. 

పరమాత్మ ఉపాసన అన్నా ఇదే. భక్తులు భగవంతుడు అన్నా ఇదే. 

గురువు బ్రహ్మము వేరు కాదన్న అభేదజ్ఞానం కలగడమే భక్తి. ఈ భక్తితో మాయను దాటటం సులభం. 

యోగ్యులు శ్రద్ధ కలిగిన వివేకవంతులు జ్ఞాన వైరాగ్యాలను సంపాయించుకుంటారు. ఈ ఆత్మ తత్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు. 

ముల్లుని ముల్లుతోనే తీసివేసినట్లు, అజ్ఞానమనే ముల్లును జ్ఞానమనే ముల్లుతోనే తీయాలి. నేను నాది అనేది పోయినదాకా జ్ఞానజ్యోతి తన ప్రకాశం వ్యక్తం చేయదు. గురువులు చూపించిన దారిలో నడిస్తే ఈ జ్యోతి తొందరగా వెలుగుతుంది. 

ఓం శ్రీ సాయిరాం!

Saturday, July 25, 2020

గురువే పరబ్రహ్మము.



భగవంతుడిని సగుణం మరియు నిర్గుణం అనే రెండువిధాలుగా చెప్తారు. సగుణ స్వరూపమునకు ఆకారము ఉంటుంది కాని నిర్గుణము అంటే ఆకారము లేదు. ఇక్కడ ఆకారము ఉండదు అంటే అంతా ఆ పరబ్రహ్మమే అయినప్పుడు, ఇంకా ఆకారంతో పని లేదు.  రెండును పరబ్రహ్మ స్వరూపములే. 

మొదట్లో సగుణ స్వరూపమే మనకు అనువుగా ఉంటుంది. భక్తి వృద్ధి చెంది, జ్ఞానం కలిగితే అప్పుడు నిర్గుణ ఆరాధన కుదురుతుంది. బాబా అందుకే తనను నిర్గుణంగా ఆరాధించమని చెప్పి అలా కుదరకపోతే అప్పుడు నన్ను సగుణంగా పూజించండి అని చెప్పారు. 

భక్తిపై గట్టి నమ్మకం ఉండాలి అని సాయి చెప్పారు. ఆయన రకరకాల దేవతలా రూపంలో దర్శనం ఇచ్చారు. అలానే వేరే గురువుల రూపంలో కూడా దర్శనం ఇచ్చారు. అలాంటి ఒక సన్నివేశమే డాక్టర్ పండిట్ గారి కథ.  

ఒక సారి తాత్యా సాహెబ్ నూల్కర్ స్నేహితుడైన డాక్టర్ పండిట్ అనే ఆయన షిర్డీ వచ్చారు. బాబా అతనిని దాదా భట్ వద్దకు పంపిస్తారు. వారు ఇరువురు బాబా దగ్గరకు వచ్చినప్పుడు, ఈ డాక్టర్ పండిట్ బాబాకు నుదిటిపై త్రిపుండ్రం పెడతాడు. అందరికి ఆశ్చర్యం ఎందుకంటే బాబా ఎవరిని అలా బొట్టు పెట్టనివ్వరు. దాదా తరువాత ఆలా ఎందుకు చేయనిచ్చారు అని అడిగితె బాబా ఇలా చెప్పారు. ఈ డాక్టర్ నాలో తన గురువైన రఘునాథ్ (కాకా పురానిక్) గారిని చూసుకున్నాడు. అందుకే అతను ఆలా చేయగలిగాడు అని సమాధానం ఇచ్చారు.  ఇక్కడ ఆయన చూపించిన నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడివేసింది అని కూడా బాబా చెప్పారు. దాదా భట్ తరువాత డాక్టర్ పండిట్ ఈ విషయం గురించి అడగగా తన గురువుని బాబాలో చూసినట్లు చెప్తారు. సాయి ఈ విధంగా మన గురువుని మనం ఎలా ఆరాధించాలో నేర్పించారు. 

మనం మన గురువుతో మమేకం అవ్వాలి. 

ఆయన దారే మన దారి కావాలి. 

సాయి ఆరాధన అన్నిదేవతల ఆరాధన కన్నా గొప్పది అని తెలుసుకోవాలి. 

ఒక్క సారి మనకు గురువు లభిస్తే ఆ గురువు తప్ప మనకు వేరే ఆరాధనలతో అవసరం ఉండదు. ఎందుకంటే గురువే పరబ్రహ్మము. 

ఓం శ్రీ సాయిరాం!

Guru is Brahman -Paramatma



There are two aspects of God or Brahman : (1) the Unmanifested (Nirgun) and (2) the Manifested (Sagun). The Nirgun is formless, while the Sagun is with form, though both denote the same Brahman. Some prefer to worship the former, some the latter. 

Our love and devotion do not develop unless we worship Sagun Brahman for a certain period of time, and as we advance; it leads us to the worship (meditation) of Nirgun Brahman.

Shirdi Sai always emphasized the importance of faith in our devotion. He reassured us that he will bless us no matter what.  He appeared as Rama, Datta, Hanuman, Shiva, and all other forms when his devotees prayed to him in those forms. Hemadpanth talks about Dr. Pandit’s story in Sri Sai Satcharita where Baba appeared as Sri Guru Raghunath from Dhopeswar (Kaka Puranik). 

Dr. Pandit came to to Shirdi only once to see Baba. When he went to Dwarakamai, Baba told him to go to Dada Bhat.  Later he came along with  Dada for Baba's worhip. Dada is a staunch devotee of Baba and till then no one had dared to apply fragrant paste (gandh) “ tilak ” (circular, auspicious mark on the forehead) to Baba. Baba would not allow anyone to apply the fragrant paste to his forehead. Only Mhalsapati smeared it on his throat; others applied it to his feet. But this Pandit was full of devotion. He took away Dada's puja dish,  and holding Sree Sai’s head, he smeared him  with  the three  fingered  parallel  lines; (tripundra). Watching this Dada’s heart began to beat fast. He thought that Baba would be enraged. Thus the impossible had happened! Baba did not utter a word. On the contrary he seemed quite pleased and did not get angry with him at all. So be it.  He let that moment pass.  When Dada asked Baba why he let Dr. Pandit paste tilak and why not others.  Baba said, " He saw his Guru in me and I had no choice except to let him do the worship". Then when Dada spoke to Dr. Pandit he confirms that he saw his Guru Raghunath from Dhopeswar (kaka Puranik) in Baba. 

Sai is even greater than all the seven forms that we all worship – Image of God, Sacrificial altar, fire, supreme light, sun, water, Brahmin (those wearing the sacred thread). Through this story, Baba taught us how to merge with Guru with worship. Sai wanted us to learn how to love our Guru and to have single mindedness in worshiping your Guru.

Om SriSairam!

Saturday, June 20, 2020

భగవద్గీత 4. 1 జ్ఞాన యోగం - సర్వం విష్ణుమయం



ఎన్నో జీవ రాసులుగా జన్మలు తీసుకున్న తరువాత మానవ జన్మ వస్తుందని మన శాస్త్రాలు చెప్తాయి. అలానే ఇలాంటి మానవ జన్మలు కూడా ఎన్నో మనం ఇంతకూ ముందు తీసుకొని ఉండవచ్చు. మనం ఈ శరీరాన్ని వదిలివేయడాన్ని చనిపోవడం అని పిలుస్తాము. శరీరం వదిలివేస్తే మనతో ఏమి తీసుకు పోతాము అనే విషయాన్ని మన శాస్త్రాలు చెప్పాయి. మనతో సూక్ష్మ, కారణ శరీరాలు వస్తాయి. వీటిలో మన పూర్వ జన్మ కర్మలు, సంస్కారాలు మరియు వాసనలు ఉంటాయి. వీటి ఆధారంగానే మనం ఎక్కడ, ఎలా, ఎవరికి పుట్టాలో నిర్ణయించబడుతుంది. కాని పరమాత్మ జన్మ తీసుకుంటే దాన్ని అవతారం అని పిలుస్తాము. ఇక్కడ వాసనలు కర్మలతో సంబంధం ఉండదు. పరమాత్మ తత్త్వం అంతటా ఉంటుంది, అందుకే ఆ తత్వాన్ని విష్ణువు అని పిలుస్తాము. ఈ విష్ణు తత్త్వం అంతటా ఉంటుంది కాబట్టి, ఎక్కడ అవసరం అయితే అక్కడ అవతార పురుషుల రూపంలో వ్యక్తం అవుతుంది. అందుకే మనం దేవుడు దిగివచ్చాడు అంటాము. అంటే ఈ త్రిగుణాత్మకమైన మానవ స్థాయికి ఈ విష్ణు తత్త్వం రావాలి. అప్పుడే మనం ఆ తత్వాన్ని చూడగలం.

మనకు ఇంతకూ ముందు ఎన్నో జన్మలు వచ్చి పోయాయి. అవన్ని గుర్తు ఉంటె మానవులుగా తట్టుకునే శక్తి మనకు లేదు. ఈ జన్మలోని బంధాలతోనే మనం కష్ట పడుతూ ఉంటె, ఇక అన్ని జన్మలలో ఉన్న సంబంధాలు ఎదురుగా కనపడుతూ ఉంటె అసలు తట్టుకోలేము. అందుకే మనకు పూర్వ జన్మల అనుభవం లేకుండా దేవుడు మంచి ఉపకారం చేసాడు. అలా అని మనకు ఏమి గుర్తు ఉండదు అని కాదు. మనం స్కూలులో ఒక్కో తరగతి తరువాత ఒక్కటి దాటి 
పైచదువులకు వెళ్తాము. కింది తరగతులలో చదివిన అన్ని పాఠాలు మనకు పూర్తిగా గుర్తు ఉండవు. వాటినుంచి నేర్చుకున్న జ్ఞానం ఏదైతో ఉందొ అది మాత్రం మనతో తీసుకు వెళ్తాము. అక్కడ నేర్చుకున్న వాటి వల్ల మనలో ఒక రకమైన ఎదుగుదల వస్తుంది. అది మనకు జీవితాంతం ఉపయోగపడుతుంది. అలానే మనం పూర్వ జన్మలలో చేసిన కర్మలు, పొందిన అనుభవాలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్ధం అవుతుంది. అందుకే భగవానుడు ధర్మాన్ని అనుసరించమని, జీవితాన్ని కర్మ సిద్ధాంత పరంగా అర్ధం చేసుకోమని చెప్పడం జరిగింది. ఇలా చేస్తే మనం ఒక రోజు ఆ విష్ణు తత్వంలో ఐక్యం అవుతాము అని రాబోయే శ్లోకంలో చెప్తున్నారు.

జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః !
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సః అర్జున !!

ఓ అర్జున ! నా అవతారములు, కర్మములు దివ్యములు. అనగా నిర్మలములు మరియు అలౌకికములు. ఈ తత్వ రహస్యం తెలుసుకున్న వారు తనువును చాలించిన పిమ్మట మరల జన్మించరు సరిగదా! వారు నన్నే చేరుకుందురు.

ఇక్కడ భగవంతుని కర్మలు దివ్యములు అని చెప్పారు. అంటే ఈ కర్మలు వాసనలకు సంబంధించినవి కావు. వీటిలో స్వార్ధం అనేదే ఉండదు. ఇక్కడ కర్త్రుత్వ భావన ఉండదు. మహానుభావులు కూడా దివ్య రూపులే. వారి కర్మలు ఫలాసక్తి రహితంగా ఉంటాయి. 

మనం ఈ రహస్యాన్ని అర్ధం చేసుకొని కర్మ యోగాన్ని అనుసరిస్తూ సాధన కొనసాగిస్తే మనం ఆ భగవంతుడిని తప్పక చేరుకుంటాము. అంటే మరల జన్మ కర్మబంధాలలో ఇరుక్కోము.


ఓం శ్రీ సాయిరాం!






Saturday, May 30, 2020

చోల్కర్ భక్తి - చక్కెర లీల


ఒక సారి ఠాణా జిల్లాలో కౌపీనేశ్వర దేవాలయంలో దాసగణు గారి హరికథా ఏర్పాటు చేశారు. అక్కడకు చోల్కర్ అనే ఒక సామాన్య ఉద్యోగి కూడా వచ్చాడు. ఆయన సాయి మహిమల గురించి విని పరవశం పొందుతారు. అక్కడకు వచ్చిన వారు కొంతమంది దాసగణు గారి కీర్తన విధానం కోసం వస్తే, మరికొంత మంది గానం కోసం లేదా నృత్యం కోసం వస్తారు. కాని చోల్కర్ మాత్రం సాయి లీలామృతంలో మునిగిపోయాడు. సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది. 

అప్పుడు సాయిని ఈ విధంగా ప్రార్ధిస్తాడు. 
"సాయి దయామయా! ఈ దీనుని అనుగ్రహించు, నాది పేద సంసారం. ఉద్యోగంపైనే ఆధారపడ్డాం. ఉద్యోగం ఖాయం కావాలి అంటే పరీక్ష ఉత్తీర్ణుడవ్వాలి. నా జీవితం ఉద్యోగంపైనే ఆధారపడివుంది. మీ కృపతో ఇది నెరవేరితే మీ దర్శనం చేసుకొని మీకు పటిక బెల్లం సమర్పిస్తాను" అని వేడుకుంటాడు. అతని కోరిక నెరవేరి ఉద్యోగం నిలబడుతుంది. షిర్డి వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అవుతుంది అందుకని తన ఖర్చులను తగ్గించుకొన్నాడు. ఆఖరికి చెక్కర లేకుండా టీ తాగడం కూడా అలవాటు చేసుకుంటాడు. ఇలా కొంత డబ్బు ఆదా చేసి షిర్డీకి వెళ్తాడు.

బాబాను దర్శించుకొని పటిక బెల్లం మరియు కొబ్బరికాయను సమర్పించి ఈ రోజు నా సకల కోరికలు తీరి నా జీవితం సఫలం అయ్యింది. చోల్కర్ జోగ్ ఇంట్లో అతిధిగా ఉంటారు. చోల్కర్ జోగ్ తో బయల్దెరపోతే బాబా జోగ్ తో ఇలా అంటారు. "ఇతనికి త్రాగటానికి కప్పులో చెక్కెర బాగా ఎక్కువగా వేసి టీ ఇవ్వు". జోగ్ కి వింతగా అనిపిస్తుంది కాని చోల్కర్కి మాత్రం ఆనందాశ్రువులు దొర్లుతుండగా బాబా కాళ్లపై తన శిరసు ఉంచాడు. 

అప్పుడు బాబా " చోల్కర్ నువ్వు అనుకున్న పటిక బెల్లం అందింది. నీ త్యాగనియమం కూడా పూర్తిఅయింది.  మొక్కు త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. మీరెవరైనా ఎక్కడున్నా భక్తితో నా వైపు మళ్లితే ఎల్లప్పుడు మీతోనే ఉంటాను. ఈ శరీరం ఇక్కడ ఉన్నా మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. అన్ని జీవరాసులలో నేనే ఉన్నాను నన్ను తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు. ఇలా బాబా ఎంతో ప్రేమతో చోల్కర్ భక్తిని స్థిరపరిచారు. 

ఓం శ్రీ సాయి రామ్! 

Cholkar's devotion



Once Das Ganu Maharaj was doing kirtan in Pune where Cholkar happened to be there. While listening to Sai stories from Das Ganu Maharaj he had goosebumps and developed some special attachment to Sai. He humbly prayed to Sai by saying " Baba, I am poor and have to look after a family. My life depends on my job. I have to pass an examination to become permanent. I have prepared with a lot of effort. I solely depend on passing the examination. Otherwise. I will lose this job which I hold on probation and I will be deprived of the little that I earn. If I pass by your grace, I will present myself at your feet and distribute sugar candy in your name. This is my firm resolution ”.

He postponed his resolution because of his poverty, but he decided to save some money by cutting his expenses. He stopped eating any thing made of sweet and having his tea without sugar. He started saving some money and once he got his promotion he went to Shirdi. He prostrated in front of Baba and with a pure heart he distributed sugar, offered coconut and said: “To-day all my wishes have borne fruit ”. He was staying with Bapu Saheb Jog and while they were leaving Baba told Jog to make sure Cholkar gets tea with lots of sugar. Jog could not understand what Baba was saying but Cholkar was moved. He understood the greatness of Baba. 

Baba gave reassurance and said these words. "If you spread your palms with devotion before me, I am immediately with you, day and night. Though, I am here physically, still I know what you do beyond the seven seas. Go where ever you wish, over the wide world, I am with you. My abode is in your heart as well as in hearts of all beings. Blessed and fortunate indeed is he, who knows me thus". Such is the presence of Sai and all of us should have no second thoughts about this truth. 

OM SRI SAIRAM!

Wednesday, April 29, 2020

నిరాడంబరత - సాయి సందేశం



ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల సాయి మన జీవితంలో ప్రవేశించారు. సాయి తన భక్తులను జాగ్రత్తగా కాపాడుతు ఆధ్యాత్మిక పధంలో నడిపిస్తారు. సాయి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు ఉంటే చాలు మనం ఈ భవసాగరాన్ని దాటవచ్చు. సాయి భక్తులు ఎన్నడు నిరాశకు లోనవ్వరు. వారి జీవితంలో సుఖశాంతులికి కొదవ ఉండదు. సాయి ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండమని చెప్పారు. ఒక్కోసారి మనం దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం అవుతాము. 

సాయి సమర్ధుని కృపతో దాసగణు మహారాజ్ సత్పురుషుల కథలను రచించి, ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందారు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపచేసారు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమరసాన్ని పెంపొందించారు. దాసగణు షిర్డీకి రావడానికి కారణం నానాచందోర్కర్. నానా వల్ల సాయి భక్తి నలుదిశలా వ్యాపించింది. ఒక సారి దాసగణు మహారాజ్ షిర్డీ గ్రామంలో హరికథా కీర్తన కోసమని శరీరంపై కోటు, కండువా, తలకు పాగా కట్టి బయలుదేరారు. బాబా ఆశీర్వాదం కోసమని వస్తే బాబా ఇలా అంటారు. "వాహ్వా పెళ్ళికొడుకు లాగా అలంకరించుకుని, ఎక్కడకు వెళ్తున్నావు? అని అడుగుతారు. కీర్తన చెప్పడానికి ఇవన్నీ అవసరమా! వీనిని నా ఎదుట తీసివేయి అని చెప్తారు. అప్పటినుంచి దాసగణు మహారాజ్ ఒక్క పంచ కట్టుకొని చొక్కా లేకుండా, చేతిలో చిడతలు మరియు మేడలో మాల వేసుకొని హరికథ చెప్పేవారు. ఇదే ప్రసిద్ధమైన నారదీయ పద్దతి. బాబా ఈ నిరాడంబరతనే కోరుకునే వారు. ఇక్కడ మన ధ్యేయం అంతరంగ పరిశుద్ధత.  

మీరెవరైనా ఎక్కడున్నా భక్తితో నా వైపు మళ్లితే ఎల్లప్పుడు మీతోనే ఉంటాను. ఈ శరీరం ఇక్కడ ఉన్నా మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. అన్ని జీవరాసులలో నేనే ఉన్నాను నన్ను తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు.

దేవుడికి ఎంత చేసినా తక్కువే, కాని బాబా ఎందుకు నిరాడంబరతకు ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ఆధ్యాత్మిక సాధనలో నిరాడంబరత అవసరం ఎంతో ఉంటుంది. లేక పొతే ఈ ఆడంబర పూజలే వాసనలై చివరికి మనలను వేధిస్తాయి. ఆత్మ సాక్షాత్కారానికి నేను, నాది అనే అహంకారమే అడ్డుగా నిలుస్తుంది. 



ఓం శ్రీ సాయిరాం!












Simplicity- Sai's teaching



We became Sai devotees because of our past good deeds and Sai will make sure that his devotees will easily achieve the supreme state of existence. The listeners who have full devotion and they will be freed from attachment. For those who are full of faith, they will receive happiness and peace; and for all, in general, contentment. Sai never wanted extravagant preparations in worshiping him and he always taught simplicity. 

Once,  Das Ganu was going to do a ‘Katha’ at Shirdi. So he set off properly dressed with a long coat, uparna, and pheta on head. According to custom, he happily went to Baba to bow at his feet. On seeing him, Baba said: “Oh, now you have adorned yourself like a bridegroom!  Where are you going so dressed up? ”  Das Ganu replied: “I am going to perform kirtan”. Baba said to him, further: “Why have you taken so much trouble over dressing up? Why do you have long coat, uparna and pheta? We do not need all these things. Take them off in front of me. Why burden your body with them? ” As per his orders, he took them off and laid them at his feet. Since then, Das Ganu stopped wearing upper garment and makes no show. He carries ‘chiplis’ in his hands and a ‘mala round his neck at the time of kirtan. Though this is not generally accepted, it is of a pure origin. 

Baba gave reassurance and said these words. "If you spread your palms with devotion before me, I am immediately with you, day and night. Though, I am here physically, still I know what you do beyond the seven seas. Go where ever you wish, over the wide world, I am with you. My abode is in your heart as well as in hearts of all beings. Blessed and fortunate indeed is he, who knows me thus". Such is the presence of Sai and all of us should have no second thoughts about this truth.

As Sai devotees, we have to learn to be simple in our worship and in our daily activities. We need to be humble and considerate. We need to understand the real meaning behind Cholkar's story. Here quitting sugar means we have to stop running after luxuries in life and not avoid difficulties in life. The hardships will teach us patience. Baba is always with us no matter where we are and he is always taking care of us.

In general it is a good idea to spend time in Godly activities but we have to be careful not to get carried away and lose sight of devotion. Our goal is to know God with in us and all the outward rituals will obstruct our path in increasing the rigidity. Then it will be difficult to get rid of the ego. 

OM SRI SAIRAM! 

Saturday, March 28, 2020

Shirdi Sai Arathis





Introduction:

There are thirty psalms in all the 4 Artathis. Of those, only sixteen are especially composed on Shri Sai Baba. The rest (fourteen, i.e. about half), are traditional arathi-psalms composed by the mediaeval poet-saints of Maharashtra(excepting a Vedic chant). 

Of the fourteen traditional psalms 
5 are composed by Sant Tukaram Maharaj
2 by Sant Namadev
2 by Sant Janabai
1 by Shri Ramjanardhan Swami 
1 by Shri Rameshwar Bhat; 
1Vedic hymn  
2 Traditional prayers

 Of the sixteen psalms especially written on Shri Sai Baba 
9 are composed by Shri K.J. Bhishma 
3 by Shri Dasganu Maharaj 
1 by Shri Upasani Maharaj, 
1 by Shri Madhav Adkar 
1 by Shri Mohini Raj
1 by Shri B.V. Dev 

Linguistically, of the thirty arati psalms twenty five are in Marathi, two in Hindi, two in Sanskrit and one abilingual anthology of short Marathi and Sanskrit prayers.

OM SRI SAIRAM!





Saturday, March 14, 2020

షిర్డీ సాయి - ఊది మహిమ




 బాబా దక్షిణగా తీసుకున్న దానిని ఎక్కువగా అందరికి పంచేవారు. కొంత పైకాన్ని ధునిలోకి కావాల్సిన కట్టెలను కొనేవారు. అందులోనుంచి వచ్చే బూడిదే ఆయన అనుగ్రహంతో అందరికి ఊదిగా పంచేవారు. మనకు ఊది గురించిన లీలలు తెలుసు. బాబా ఎందుకు ఊది ఇచ్చారు. ఈ విభూతి ప్రకృతి యొక్క నశ్వరతత్వాన్ని బోధిస్తుంది. ఈ సకల విశ్వం దానిలోని వస్తువులు బూడిదవంటి వని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ శరీరం కూడా పంచభూతాల కాష్టం. శరీరంలో నుంచి జీవుడు వెళ్ళగానే కుప్పకూలుతుంది. ఇది బూడిద అని నిరూపిస్తుంది. మీది, నాది కూడా ఇదే పరిస్థితి. ఇది మీరెప్పుడూ తెలుసుకోవాలని ఊది ఇస్తాను అని బాబా చెప్తారు. ఇక్కడ విభూది యొక్క తత్వార్ధం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం. బాబా దక్షిణ తీసుకోవడానికి కూడా కారణం ఈ వైరాగ్యాన్ని మనకు నేర్పించేందుకే. 

బాబా చాలా ఉల్లాసంగా ఒక పాట పాడేవారు. "రమతే రామ ఆయోజి, ఆయోజి ఉదియాంకి గోనియా లాయోజి!" రాముడు తిరుగుతూ తిరుగుతూ వచ్చాడు, ఊది సంచులను పట్టుకుని వచ్చాడు. బాబాకు ఈ పాట అంటే ఎంతో ఇష్టం అయ్యుండాలి లేకపోతే అంత ఉల్లాసంగా ఎందుకు పాడేవారు. ఆ రామనామం ఇచ్చేటువంటి పరమానందం కంటే మోక్షం ఇంకెక్కడ దొరుకుతుంది. దక్షిణ ఇచ్చి ఊది తీసుకుంటే గాని అది అర్ధం కాదు. 

ఒక సారి నారాయణ మోతిరాం జాని అనే బాబా భక్తుడు తన స్నేహితుడికి తేలు కుడితే బాబా ఊదికోసం చూస్తాడు. కాని ఊది దొరకక అక్కడ బాబా పటం దగ్గర ఉన్న అగరువత్తుల బూడిద తీసుకొని బాబాను స్మరించుకొని ఆ ఊదీని తేలు కుట్టిన ప్రదేశంలో రాస్తాడు. అతనికి నెప్పితగ్గి ఉపశమనం కలుగుతుంది. అలానే ఇంకొక బాబా భక్తుడు తన కుమార్తె ప్లేగు వ్యాధిసోకి బాధపడుతూ ఉంటె నానా చాందోర్కర్ గారిని ఊది పంపమని కోరతాడు, కాని నానా ఆ సమయంలో ప్రయాణంలో ఉంటాడు. తన దగ్గర ఊదిలేక రోడ్డు మీద కొంచెం మట్టి చేతిలోకి తీసుకొని సాయి నామ జపం చేసి తన భార్య నుదిటిపై రాస్తాడు. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూసేను. అతడు ఇంటికి పోవుసరికి ఆతండ్రి తన కుమార్తెకు జబ్బు తగ్గేనని చెప్పెను. 

బాబా ఈ ఊది ద్వారానే నానాచందోర్కర్ కుమార్తె మైనతాయికి సుఖ ప్రసవం జరిగే లాగా చేసి తన, తన బిడ్డ ప్రాణాలను రక్షించారు. బాబా కలరా వ్యాధిని షిరిడీనుంచి దూరంగా తరిమికొట్టారు. ఇలా బాబా తన భక్తులను ఎప్పుడు రక్షిస్తూనే వుంటారు. 

సాయి భక్తులారా మనందరం సాయిపై నమ్మకంతో ఎలాంటి ఉపద్రవాలైన ఎదుర్కోవచ్చు. 



ఓం శ్రీ సాయిరాం!