In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Sunday, March 3, 2019

జ్ఞాన జ్యోతి - నీటితో దీపాలు



షిర్డీ సాయి సాకారుడిగా శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలు చేసి మన మనస్సులను మార్చే ప్రయత్నం చెసారు. సాయి నిరాకారుడుగా మన అందరి హృదయాలలో ఉండి మనకు ఎన్నో అనుభూతులను, చమత్కారాలను చూపిస్తూనే ఉంటారు. ఈ సత్యాన్ని మనం ఎప్పటికి మరవకూడదు. 

మనకు కష్టం
 వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవటం కాదు, మన మనస్సే సాయి నిలయం కావాలి. అప్పుడు కష్టం గురుంచిన ఆలోచనే మనకు రాదు. ఒక వేళ వచ్చినా అది అంతగా మనలను బాధ పెట్టదు. మనం ఈ కష్టాల వలయం వద్దని కోరుకుంటాము, కాని మనం ఆ వలయంలోనే జీవించి ఉండాల్సి ఉంది. మనము ఈ క్షణికమైన జీవితాన్ని, ఈ వలయాన్ని దాటి పరమాత్మ తత్త్వం అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలని సాయి తపన పడుతూనే ఉంటారు. శ్రద్ధ సహనాలనే మంత్రాలతో ఈ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని మనకు బోధ చేసారు. 

బాబా చేసిన చమత్కారాలలో ఉండే ఆధ్యాత్మిక బోధలను మనం అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. వాటిని అర్థం చేసుకుంటే మానవ జన్మ లక్ష్యం ఏమిటో మనకు అవగతం అవుతుంది. ఈ లక్ష్యాన్ని చేరటానికి కావాల్సిన సాధనాసామాగ్రిని మనకు ఇచ్చి, బాబా మన దగ్గరే ఉండి మనలను అనుగ్రహిస్తారు. అటువంటి ఆధ్యాత్మిక అర్ధం ఉన్న చమత్కారమే నీటితో దీపాలను వెలిగించిన సన్నివేశం. కాని దీన్నీ ఒక చమత్కారంలాగా మాత్రమె చూడకుండా దాన్లో ఉన్న అర్ధాన్ని గ్రహించాలి.

ఈ నీటి దీపాల గురించి సాయి సచ్చరితలో ఇలా చెప్పబడింది. 
మొదట్లో సాయి సమర్ధులకు దీపొత్సవమ్ అంటే చాలా ప్రీతి. అందుకోసం వారు స్వయంగా దుఖాణదారుల వద్దకు వెళ్లి నూనెను అడిగేవారు. రేకు డబ్బా పుచ్చుకొని నూనె తెచ్చి దీపాలను వెలిగించెవారు. అలా కొన్ని రోజులు ఆగకుండా ఈ ప్రక్రియ సాగింది. దీపారాదన అన్నబాబాకు బహుప్రేమ. దీపావళి వలె దీపోత్సవాన్ని చేసేవారు. చింకి గుడ్డలతో వత్తులు చేసి మసీదులో దీపాలను వెలిగించేవారు. 

రోజూ ఉచితంగా నూనె అడిగి తెచ్చేవారు. దాంతో వ్యాపారుల మనస్సులో దురాలోచన కలిగింది. అందరూ కలిసి బాబాకు నూనె ఇవ్వకూడదని అనుకోని బాబా వచ్చినప్పుడు నూనె లేదని చెప్తారు. బాబా మౌనంగా తిరిగి వస్తారు. అప్పుడు బాబా ఏమిచేస్తారో అని వాళ్ళందరు వింతగా చూడసాగారు. బాబా మసీదులో ఉన్న రేకు డబ్బాను తీసుకోని దాంట్లో ఉన్న కొంచం నూనేను తాగేశారు. ఆ విధంగా బ్రహ్మాఅర్పణ చేసి ఒట్టి నీటిని ప్రమిదలలో పోశారు. తరువాత ఆ నీటిలో పొడి వత్తులను తడిపి అగ్గిపుల్లను గీచి దీపాలను వెలిగించారు. నీటితో దీపాలు వెలగటం చూసి వర్తకులు ముక్కు మీద వేలు వేసుకున్నారు. మేము బాబాతో అబద్దం చెప్పామని వారిలో వారు అనుకున్నారు. కొంచమైన నూనె లేకుండా నీటితో దీపాలు రాత్రంతా వెలగటం చూసి వర్తకులు సాయి అనుగ్రహానికి పాత్రులు కారని అందరు అనుకొన్నారు. బాబా యొక్క సామర్ద్యం తెలియక తప్పు చేసామని వర్తకులు పశ్చాత్తాప పడ్డారు. కాని బాబా మనసుని జయించిన వారు. వారికి రాగద్వేషాలు ఉండవు. వారికి శత్రువులు మిత్రులూ అంటూ లేరు. వారికి అన్ని ప్రాణులు సమానమే.
 

ఈ సన్నివేశం లోని అర్థం

ఈ కథలోని అర్ధాన్ని మనం అర్ధం చేసుకోవాలంటే మనం కాకడ ఆరతి గుర్తు చేసుకోవాలి. మనం ఈ అరతిలో ఈ విధంగా పాడుకొంటాము. 

కాకడ ఆరతి కరీతో సాయి నాథ దేవా!చిన్మయ రూపా దాఖవి ఘేవుని బాలక లఘు సేవా!!
హే సాయి ప్రభూ: నీకు కాకడ హారతి అర్పిస్తున్నాను! పసివాడను అయిన నా సేవను ప్రేమతో స్వీకరించి, నీ చిన్మయరూపం నాకు ద్యోతకం అయ్యేటట్టు చేయి దేవా!!

కామ క్రోధ మద మత్సర - ఆటుని కాకడ కెలా!
వైరాగ్యాచే తూప కాడుని మీతో బిజవీలా!  
సాయి నాథుని గురు భక్తి జ్వలినేతోమీ పేటవిలా! 
తద్ వృత్తి జాలునీ గురునే - ప్రకాశపాడిలా!! 

ద్వైతతమా నాసునీ- మిళవీ తత్స్వరూపి జీవా!!!
అరిషడ్ వర్గాలతో ఉన్న నా మనస్సును ఒత్తిగా చేసి,
వైరాగ్యం అనే నేతితో తడిపి, 
నీ ఫైనున్న అనన్య భక్తి అనే జ్యోతిని వెలిగించాను. 
ఆ కాంతిలో నా గురు దేవుడు ప్రకాశవంతంగా కనిపించారు. 
ద్వైతభావం నశించి, తత్స్వరూపిగా జీవుడు మిగిలాడు.  



ఆధ్యాత్మిక భావం
సాయి మనలను అడుగుతున్నది ఏమిటి?

ఈ జీవన వ్యాపారం చేసే వర్తకులం అయిన మననుంచి సాయి అడిగే తైలం ఏమిటి?

ఈ కథలో లాగా మనమందరమూ నూనె వర్తకులమే. ఇక్కడ నూనె అంటే వైరాగ్యము.

బాబా అడిగేది శ్రద్దా సబూరి మాత్రమే. కాని మనం కూడా ఆ వ్యాపారుల లాగా బాబా అడిగిన దాన్ని ఇవ్వము. 

కాకడ అరతిలో చెప్పినట్లుగా కామ క్రోధ లోభ మోహ మద మాత్స్యర్యములను అరిషడ్ వర్గములను వదులుకోలేము. ఈ ఆరింటిని ఒక వత్తిలాగా చేసి, వైరాగ్యం అనే నేతిలో ముంచి, భక్తి అనే భావనతో ఉన్నప్పుడు సాయి సమర్ధులు ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించితే, ఇక అజ్ఞానమనే అంధకారం తోలిగిపోతుంది. అప్పుడు మన జీవితం జ్ఞానవంతం అవుతుంది. అప్పుడు జీవుడికి
 ద్వైత భావన తొలిగిపోయి తనే పరమాత్మననే అనుభూతిలో ఉండిపోతాడు. 

మనం బాబా అడిగిన శ్రద్ద సబూరిలను ఇవ్వక పోయినా సాయి మనలను ఎప్పుడూ క్షమిస్తూనే ఉంటారు. 

ఆయన అపర దయామూర్తి. 

అయన కరుణా పూర్వకమైన చూపులే చాలు మనలను జాగృతం చేయడానికి. 

అయన మనలను అనుగ్రహించే ప్రక్రియలో చూపించే సహనం అద్వితీయం. 

ఒక్కసారి మనం కనుక అయన అడిగింది ఇవ్వడం ప్రారంబిస్తే ఇక సాయి అనుగ్రహానికి అంతే ఉండదు. 
సాయి మనలను మన గమ్యానికి చేర్చిందాక వదలరు. 

సాయి ఎలాగైతే నీటితో దీపాలను వెలిగించారో అలానే ఏ అష్టాంగ సాధనల అవసరం లేకుండా  మనకు ఆత్మసాక్షాత్కారం కలగ చేస్తారు. మనకు కావాల్సిందల్లా సాయిఫై అపారనమ్మకం. 

మనలో ఆ తైలం కాస్తంత తగ్గినా, లేకపోయినా కేవలం నీటితోనే మనలో ఆ దీపాన్ని వెలిగిస్తారు. 

అటువంటి నమ్మకాన్ని మనం కలిగిఉందాము. 

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ గురు మార్గంలోనే నడుద్దాం. 



సాయి అనే తారక మంత్రాన్ని గట్టిగా పట్టుకుందాం. 




ఓం శ్రీ సాయి రామ్ !  

The lamp of Knowledge - Aqua Lamps


Shirdi Sai showed us so many miracles when he was in flesh. He performed these so called miracles not to impress anyone but to change our lame minds. The omnipresent Sai continued to show miracles and personal experiences by living in our hearts. We should never forget this fact. 

We usually think of Sai when face difficulties, and this is fine. But our hearts should be the abode of Sai. Then we do not even be concerned about the difficulties in our lives. Even if we face such problems, they do not bother us. We do not wish to be in that vicious whirlpool of life. But that is reality and we cannot avoid it. We have to go beyond the difficulties of life to realize the supreme God. Baba always tried to teach us this as a fact by giving us powerful mantras such as Shradda & Sabhuri. 

We have to make an effort to understand the deeper meaning behind Sai's teachings. If we understand these teachings, our lives will be improved and we will walk towards the ultimate goal of human life. Baba will protect us, if we choose to travel this path. He will bless us by staying all the way with us. One of those special teachings came through the following story.  The story of lighting earthen lamps with water is an illustration of his nature. This is called Yatha Sankalpa Siddhi.  We cannot just look at this incident as a miracle but as a means to change our lives.


The story from the Sai Satcharita goes as follows ;

In the early days, the great Sai was very fond of burning oil lamps. Therefore, he himself used to go to the shopkeepers and ask for oil. Carrying a tumbler-like container in his hand, he begged for oil from the shops of the grocers and oil-mongers. After bringing it he would fill the earthen oil lamps. He burnt the lamps brightly in the temples and the Masjid. This continued for sometime. Out of love for the worship of the light, he even celebrated Deepavali with illumination. He would make twisted wicks from rags and would burn the lamps in the Masjid. He brought the oil, daily, free of charge. Therefore, the oil-mongers conspired against him to put an end to this nuisance. Later, when Baba asked for oil as usual, the shop keepers refused, it leads to a great wonder by Baba, to enlighten us in the spiritual path. Baba went back without a word and put the dry wicks in the earthen lamps. What could he do without the oil? The grocers watched that fun! Baba picked up a pot, which was on the parapet of the Masjid, in which there was little oil, not enough even to light the evening lamp. Then he put water into the oil and Baba drank it. Thus having offered it to Brahman, he took pure water. Then he poured the water in the lamp and soaked the dry wicks completely; struck the matchsticks and lit the lamps for all to see. Seeing the lamps burning with water, the grocers were dumbfounded. They felt disgusted with themselves that they had lied to Baba. Even though there was not a drop of oil, the lamps burnt throughout the night. People started commenting that the shopkeepers had now lost Sai’s grace.  The grocers felt repentant for having harassed Baba (causing him anguish without any reason) and having committed the sin of uttering lies. They realized how great the Baba’s power is! Baba never thought of this. He was never angry or hated any person. He had no friends or foes, and all creatures were equal for him.


Spiritual meaning behind this story:  

We can learn the meaning behind the story from the Kaakad aarati. We all recite the following words during the aarati.

Kaakad aarati kareeto Sainatha deva
Chinmaya roop daakhavee ghewuni balak laghu seva


Let me do Kaakad Aarti, in the early morning hours, O Lord Sainath! Show me your pure, intelligent and handsome form, and accept this insignificant service from me, your child.


Kaam krodh mad matsar aattunee kaakada kela
Vairagyache toop ghaaluni mee to bhijaveela

I have compressed and entwined lust, anger, ego, envy and made them into a wick for the lamp; and soaked it into the ghee (clear butter) of asceticism that I have poured.

Sainath Guru bakti jwalane to mee petawila
Tad vryitti jaluni guroo ne prakash paadila
Dwaita tama naasooni milavi tatswaroopi jeewa


I have lit it with the spark of devotion for Sainath Guru (Master). After burning up the vices, the Guru has shed the light on me. Destroy the darkness of duality and merge me in thy Self.


If we carefully examine the meaning; 

What Baba is asking us? 

Sai Baba is asking us for oil and we are all shop keepers. 

Oil is nothing but asceticism (Vairagya or dispassion).  

If we refuse to give him the faith and patience, then he cannot help us to get rid of the six enemies ( Kama, Krodha, Lobha, Moha, Mada & Matsarya)  which are called together as Arishadvargas. 

We have to make these six enemies into a wick, soak it in the oil of dispassion or vairagya and light with spark of devotion. 

Even if we do not have enough oil or have no oil, still Baba will light our lamps of life with just water. 

Sai has to light our lamp, which is our Ajnana or ignorance. Then we fill our lives with light that is knowledge.  

Sai forgives us even we keep refusing to follow the path (give him the oil) he showed and he is so patient with us so that we can learn our lessons.

Once we learn and realize, then he pushes us to walk with Shradda and Sabhuri. If we do this enough then he grants us his grace that is ultimate peace or bliss.



Om Sai Ram!   

Saturday, February 23, 2019

శరణాగతి


భగవంతుని పట్ల ప్రేమనే భక్తి అంటారు.
ఈ భక్తి ఎప్పుడైతే ఏమి ఆశించదో అప్పుడే దానిని శరణాగతి అంటారు. 

మనము ఎవరినైన ప్రేమించాలి అంటే వాళ్ళ గురించి మనకు తెలియాలి. వాళ్ళ మీద ఇష్టం ఏర్పడాలి.
అట్లానే మనకు దేవుడి మీద ప్రేమ ఏర్పడాలి అంటే దేవుని గురుంచి మనం తెలుసుకోవాలి.
           
మనకి భక్తి ఉన్నదా లేదా అని ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. ఉంటే మన భక్తి కేవలం భగవంతుని కోర్కెలు కోరడానికి మాత్రమేనా లేక శణాగతి చేసే అవగాహన ఉందా?
            
బాబా ఎప్పుడూ శ్రద్ద అనే విషయాన్ని ముఖ్యమైనదిగా చెప్పడం జరిగింది. ఈ శ్రద్ద అంటే ఏంటి? శ్రద్ద అంటే తిరుగులేని నమ్మకము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీవు నమ్మిన గురువుల మీద కాని లేదా దేవుడి మీద కాని చెరగని నమ్మకము ఉండాలి. ఇది లేని రోజున మనము కేవలము సామాన్య భక్తుల్లా మాత్రమే మిగిలిపోతాము.
            
విషయవాంచలకు సంబంధించిన కోర్కెలను కోరుతూ భగవంతుడితో వ్యాపారం చేస్తాము. ఎంతో కృపామయుడు కాబట్టి మనం అడిగిన కోర్కెలను తీరుస్తాడు. అట్లానే బాబా తన దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళ కోర్కెలన్నింటిని తీరుస్తాడు. అందుకే బాబా ఇలా అనేవారు, "నా దగ్గరకు వారు మొదట్లో కోర్కెల కోసం వచ్చిన, ఆ తరువాత వారిని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడం జరుగుతుంది. కాని అది వాళ్ళ ప్రారబ్ధం బట్టి ఉంటుంది. వారికి విషయవాసనలు మీద మనస్సు ఉంటే, వాళ్ళు మామిడిపూతలాగా రాలిపోతారు. కొందరు పిందెలులాగా రాలిపోతారు. చాలా కొద్ది మంది మాత్రమే మామిడి పండ్లు అవ్వగలుగుతారు" అని దాము అన్నాకు ఒకసారి బాబా చెప్పడం జరిగింది.
           
బాబా మనకు శ్రద్దని నేర్పించాలి అని ఎంతో తపన పడ్తుంటే మనము పట్టించుకోము. జీవితంలో అనవసరమైన వాటి వెంట పరుగులు తీస్తాము. ఈ శ్రద్ద మనకు కాకపోతే ఇంకెవరికి.
            
ఒకసారి మహాభారత యుద్ధానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు కృష్ణపరమాత్ముడి నివాసానికి వచ్చి ఆయన సహాయం అర్ధిస్తారు. అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడ్ని కాకుండా ఆయన సైన్యాన్ని కోరుకోవడం జరుగుతుంది. కాని అర్జునుడు మాత్రం పరమాత్మనే కోరుకుంటాడు. ధుర్యోధనుడు తన వాళ్ళా దగ్గరికి వెళ్ళి పిచ్చి అర్జునుడు యుద్ధం చేయంటువంటి కృష్ణుడ్ని కోరుకున్నాడు. మనకి విజయము తధ్యము. మనవైపే ఎక్కువ సైన్యం ఉంది అని మురిసిపోయాడు. చివరికి జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు అన్న విషయం మనకు తెల్సినదే.
           
అట్లానే మనము ఎప్పుడూ ఆ సర్వేశ్వరుడు సృష్టించిన వస్తువులను మాత్రమే కోరుకుంటున్నాము. ఆయన్ని మాత్రం కోరుకోము. ఆయనను ఒక కోర్కెలు తీర్చే యంత్రంలా చూస్తాము. మనకి అవగాహన కలిగిన రోజున, కొంచెము జ్ఞానముతో కూడుకున్న భక్తి మనకి అలవాటు అయినప్పుడు, మనము నిజంగా దేవుడ్ని ప్రేమించడం మొదలుపెడ్తాము.
          
సరే  ఈ భగవంతుడు ఎవరు అంటే మనం మన పిల్లలుగా చెప్పగలమా అంతటి అవగాహన కోసం మనము ప్రయత్నిస్తున్నామా అని ఆలోచించాలి.
       
సబూరి ఎప్పుడు నేర్చుకోవాలి. మనకు నమ్మకమే ధృడంగా లేకపోతే ఇంక ఓర్పు ఎక్కడ నుంచి వస్తుంది.
  
ఇదంతా ఎందుకు జరుగుతుంది. మనుష్యులు ఇలా దేవుడి పట్ల శ్రద్ధలేకుండా ఎందుకు తయారు అవుతున్నారు అని ఆలోచిస్తే సమాధానం మనకు దొరుకుతుందా!

సాయి చెప్పిన శ్రద్ధ - సభూరి అనే మంత్రమే మన జీవితం కావాలి.  
సాయి మాటలే మనకు మంత్రం కావాలి . 
సాయి పరమాత్మే మన లక్ష్యం అవ్వాలి. 
ఇదే మనకు ముక్తి. 

ఓం శ్రీ సాయి రామ్ !

Devotion- Surrender


 Love for God is called Bhakti.
Complete and unconditional Bhakti is called surrender (Saranagati).
If we want to love someone, we need to know them and we have to really like them. In a similar way if we have to love God, we need to understand God and we have to know him. Then only we can love him.
Do we have Bhakti or not? This is the question we need to ask ourselves. If we say that we do, are we capable of surrendering to God. Baba always gave importance to Shradda (Faith). What is Shradda? It is nothing but unwavering faith towards what you believe in. If we do not have this, then we will remain as normal devotees. We always want worldly things from our God. We do some kind of business with Guru or God. But Guru is so merciful that he fulfills all our needs and wants. Baba used to say that, all my devotees come to me first with these desires. Once I bring them to me, I will try to make them realize the importance of spiritual path. But in this process, they stray and run after more desires. They drop out lacking Shradda like the pollen of Mango tree. They do not show the patience that is Sabhuri. They will fall as unripe fruits. Those who can follow me to the end are real Bhaktas. I will take them to the Moksha. These words he reiterated to Damu Anna at one time.               

Surrender to God does not signify any physical act. It is the mental attitude resulting from our understanding of our limitation to liberate ourselves from the clutches of the Illusion. When we know God is the master of Illusion, we practice Bhakti Yoga, which is to love god completely. Lord Krishna calls this as surrender to God. In life, we strive to achieve various objects of desire like name, fame, money and such. Whenever we are successful, we assume that the success is due to our hard work, perseverance and such positive qualities. The real reason for our success is God's grace.
When we cannot even adopt Shradda, when can we learn to be Patient with Sabhuri. Why is all this happening? Why we cannot be pious in our attempts towards loving God.
 In Mahabharat, once Arjuna and Duryodhana came to see Krishna Paramatma prior to war. When Krishna wanted them to choose either him or his army, Arjuna chooses Krishna, and Duryodhana wanted the whole army. He was afraid that Arjuna will choose the entire army because Krishna said that he is not going to participate in the real war. He was happy when Arjuna chose Krishna. Duryodhana goes back to his palace and tells everyone that Arjuna was foolish. In reality Arjuna chose God but not the objects made by him.
When we have God in our lives, we do not need anything. The whole universe is in him. If you have God, you have everything. Our job is always to choose only God but not the objects made by him. Because these objects are not permanent, and we do not take anything with us when we die. The only thing we take with us is our karmas and devotion that we had towards God. We should never make God as a machine that grants our boons. The day we really learn this truth and we combine this Jnana (Knowledge) with Bhakti, we will succeed in our quest for Mukthi (salvation). We will start loving God unconditionally.
Sai's teachings are our Mantras!
Sraddha & Sabhuri is the best way to reach God!
Atma Jnana is the ultimate knowledge!

                                                               OM SRI SAI RAM!




Sunday, February 3, 2019

Karma principle




This whole universe works on Karma principle. The creation also is based on collective karma (samisti karma). if we suffer from certain physical or mental pain, we have to understand that this is the result of our own past actions. These actions could be from current life or from past lives. We can find faults in other people for our problems but in reality this is a consequence of our own past karma. If we blame other people then we are committing another sin. That's why we have to understand the principle of Karma and put this into action also. Here we can remind ourselves one of the important verses in Bhagavadgita.

Karmanyevaadhikaarasthe maa phaleshu kadaachana!
Maa karma phalheturbhuh maa te sangostva karmani!!

Our right is to work only; but never to the fruits; let not the fruit of action be thy motive or attachment to inaction. 

We have to first understand how the law of Karma works. 

The laws of karma dictate all our actions and results. These laws are universal and fundamental, they do not change from person to person. They do not change from situation to situation.

Link between Karma and results: 
No one else is responsible for our status. Our past karmas determine our status. Every action will yield corresponding good or bad results based on our actions. But the intensity will change based on how well this action performed and with what intention it was done. This is true in any circumstance. These actions will not only give us the consequences but create some impressions. These impressions will lead to more future lives (Janmas). we need to have ideal conditions if we need to go through a result from certain past karma. We might say why good people go through so many difficulties? But these consequences are from past lives.

For every action, there will be proportionate and appropriate results. 
The results of an action (karma) could be visible or invisible. 

For some of the actions there will be a visible consequence and an invisible consequence which cannot be understood by the mind. The outward consequence could be because of out right action. But the invisible result is because of our intention.

A robber cuts a person with a knife and a doctor cuts a patient for an operation. In both cases the cutting is there but the intentions are different. So consequences are also different.

Sometimes we do not even realize that we are doing some thing wrong through our actions. When we eat our food, we are also part of certain sins that are called "Panchasoonas". In the process of obtaining these food items, people have caused harm to so many living beings. So who is going to bear the consequence of these actions?This is part of our samisti karma (collective action).

How do we perform our actions? 

These karmas need to be based on our scriptures. If we do not know what our scriptures say, then who is going rescue us? We got used to doing so many things because other people in the society are doing. We developed a thought process and started rationalizing, justifying our bad actions. Lord Krishna reiterated that we need to perform our actions through Karma Yoga.

Lord Krishna asked Arjuna to fight in the war. This fight should not be for revenge or for kingdom but mainly to preserve Dharma. Then this fight becomes karma yoga. In a similar way in our daily life we have to perform every action with the similar intention. A school teacher may get salary for teaching kids but if his intentions are to make these kids useful to the society, then this action becomes Karma Yoga. This applies to all the parents also. We have to question why we are educating our kids? They need to be a productive part of the society. This gives mental peace instead of imbalance in life.


We may not be able to change the results of an action or action itself once we perform that action. Once we click that send button in the computer that E-mail will reach the other person. If we have to correct this mail we have to send another mail that means doing another action. The solution is to use our Buddhi (Intellect)before we perform any action. This is like computer asking us second time before we click that delete button.

If we mistreated someone and said sorry immediately. Here we have to go through the consequence of first action that is "mistreating". But the second action saying sorry and realizing that we made a mistake, will give us the strength to endure the pain caused by first action or the intensity will be less. Sometimes we can detect some illness in the beginning stage and this will make us suffer less. This is the Fairy-tale of karma theory.

Points to be learned from above verse:


We have to perform our actions through karma yoga.

We cannot resort to inaction but we have to do these actions based on our scriptures. 


We have the right to do an action but not on the result. 


We have to perform our actions with duty oriented attitude. 




OM SRI SAI RAM!

కర్మాచరణ -కర్తవ్య బుద్ధి



 ఈ ప్రపంచం అంతా కర్మ సిద్ధాంతం మీద నడుస్తూ ఉంటుంది అని మనం అందరము చెప్పుకుంటాము. ఈ సృష్టికి కారణం కూడా అందరి సమిష్టి కర్మయే అని మన శాస్త్రాలు చెపుతాయి. మన శరీరంలో కాని, మానసికంగా గాని మనకు కష్టం కలిగితే అది మనకే ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే మన పూర్వ జన్మ కర్మయే అని అర్ధం చేసుకోవచ్చు. మనం మన చుట్టూ ఉండే వాళ్లు కాని, కొన్ని పరిస్థితులు కాని కారణం అని అనుకోవచ్చు. మన కష్టాలకు వేరే వాళ్లు కారణం ఎప్పుడు కాదు. వారిని తప్పుగా ఆలోచించండం వల్ల ఇంకో పాపపు పని చేస్తున్నామా అని అర్ధం చేసుకోవాలి. అందుకే కర్మ సిద్ధాంతాన్ని బాగా అర్ధం చేసుకొని, అనుసరించాలి. భగవద్గీతలో భగవానుడు ఈ కర్మ గురించి చాలా విషయాలు చెప్పారు. భగవద్గీతలో మనకు బాగా తెలిసిన శ్లోకం ఇలా ఉంటుంది.

 కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన !
మా కర్మ ఫలహేతుర్భూ: మా తే సంగోస్త్వ కర్మణి !!

కర్తవ్యకర్మమునాచరించుటయందే నీకధికారము గలదు. ఎన్నటికీనీ దాని ఫలముల యందు లేదు. కర్మఫలములకు నీవు హేతువుకారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్ష  రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను చేయుము.

ఈ శ్లోకాన్ని అర్ధం చేసుకోవాలి అంటే కర్మ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి.

ఒక కర్మ వల్ల వచ్చే ఫలితం అంతటా ఒకే లాగా ఉంటుంది. ఇది దేశకాల పరిస్థితులను బట్టి మారదు. ఒక కర్మ చేసిన తరువాత దాని ఫలితాన్ని వద్దు అంటే కుదరదు. అది ఎప్పుడో అప్పుడు అనుభవించక తప్పదు. కొన్ని కర్మలు ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా, మనలో ఒక వాసనను కూడా మిగిలిస్తాయి. ఈ వాసన కొత్త కర్మలకు, కొత్త జన్మకు కారణం అవుతుంది. ఒక కర్మ ఫలితం అనుభవించాలి అంటే దానికి సరియైన శరీరం, పరిస్థితులు ఉండాలి. అలా లేకపోతె అవి అన్ని సమకూరిందాక ఆ ఫలితం మనం అనుభవించలేము. ఒక్కో సారి ఎవరికన్నా కష్టం వస్తే, అయ్యో మంచివాళ్లకే ఈ కష్టాలన్ని అని మనం అనుకుంటాము. కాని ఈ ఫలితం ఏ జన్మలోదో మనకు తెలియదు.

కొన్ని కర్మలకు కనిపించే ఫలితం ఒకటి ఉంటే, కనపడకుండా ఉండేది, మరియు మన మనస్సుకు అంతు చిక్కని ఫలితం ఇంకొకటి కూడా ఉండచ్చు. బయటకు కనిపించే ఫలితం మన మాటల వల్ల లేదా మన చేతల వల్ల జరిగిన కర్మ ద్వారా వస్తుంది. బయటకు కనిపించని ఫలితం మన మనోభావాన్ని బట్టి వస్తుంది.

ఒక దొంగ దొంగతనం చేసి ఒకరిని కత్తితో పొడిచి చంపాడు. అలానే ఒక డాక్టర్ కత్తితో కోసి ఆపరేషన్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి చనిపోయాడు. రెండు చోట్లా చనిపోవడం జరిగింది. కాని ఉద్దేశాలు వేరు.  వారికి లభించే ఫలితం కూడా వేరు.

ఒక్కో సారి కొన్ని కర్మలకు వచ్చే ఫలితం అస్సలు బయటకు తెలియదు. అసలు మనం ఆ కర్మ చేసాము అని కూడా మనకు తెలియదు. మనం పంచసూనాలు అని విన్నాము. మనం వండి తినే ఆహరం మన దాకా వచ్చే లోపల ఎన్ని క్రిములు, పురుగులు చనిపోయి ఉంటాయో ఒక్కసారి ఊహించండి. మరి ఆ కర్మ ఫలితం ఎవరు అనుభవించాలి. ఈ సమిష్టి కర్మలో పాల్గొన్న వారందరు దీన్ని అనుభవించాలి.

సరే ఈ కర్మలు ఎలా ఉంటే మనకు మంచిది. అవి శాస్త్ర విహితమై ఉండాలి. కాని ఆ శాస్త్రము ఏమిటో మనకు తెలియక పోతే అప్పుడు మనలను ఎవరు రక్షిస్తారు. అందరు ఏదిచేస్తూ ఉంటే అదే మనము చేసుకుంటూ పొతే కష్టాలు తప్పవు. అందుకే భగవానుడు కర్మ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకొని కర్మయోగాన్ని ఆచరించమని చెప్పారు.

అర్జునుడ్ని యుద్ధం చేయమని భగవానుడు చెప్పాడు. కాని ఆయన ప్రతీకారం కోసమో లేక రాజ్య భోగాల కోసమో యుద్ధం చేయకూడదు. యుద్ధం ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే చేయాలి అని భగవానుడు చెప్పారు. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. అలానే మన జీవితంలో మనం రోజు చేసే పనులు ఇదే భావంతో చేయాలి. ప్రతికర్మలో స్వార్ధం తీసివేస్తే కర్మ యోగమే అవుతుంది. ఒక టీచర్ విద్యార్థులకు పాఠాలు చెప్తాడు. ఆయనికి డబ్బులు కూడా ఇస్తారు. కాని ఆయన భావంలో ఆ విద్యార్థులను మంచి పౌరులుగా చెయ్యాలి అని ఉంటే అది కర్మ యోగం అవుతుంది. మన పిల్లలు మంచి కాలేజీలో చేరితే వారి భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచన మనకు ఉండచ్చు. కాని దీనివల్ల వారు అందరికి ఉపయోగపడతారు అన్న భావనతో వారిని చదివిస్తే అది కర్మ యోగం అవుతుంది. మనం చేసే ప్రతి పనిలో ఉన్నతమైన భావన ఉంటే మనకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది.

మనం పూర్వంలో చేసిన కర్మలను మనము వెనక్కు వెళ్లి మార్చలేము. ఒక్క సారి కంప్యూటర్లో క్లిక్ బటన్ నొక్కితే అంతే ఆ మెయిల్ ఎవరికీ చేరాలో అక్కడకు వెళ్లి పోతుంది. మనం దాన్ని సరిదిద్దుకోవడం కోసం ఇంకో మెయిల్ పంపించాలి అంటే ఇంకో కర్మ చేయాల్సి ఉంటుంది. కాని ఒక కర్మ చేసే ముందు బుద్ధి అనే దాన్ని ఉపయోగించాలి. 

ఒకరు ఒక వ్యక్తిని కష్టపెట్టే మాట అంటారు. కాని వెంటనే వారి తప్పు తెలుసుకొని సారీ చెప్పారు. ఇక్కడ మొదటి కర్మకు వచ్చే చెడు ఫలితం తప్పదు, కాని ఆ పశ్చత్తాపము వలన ఆ కర్మను అనుభవించే శక్తి మనకు రావచ్చు. లేదా ఒక జబ్బు చేస్తే అది ముందే తెలుసుకొని దాని ఉదృత తగ్గే విధంగా చేసుకొనే వీలు కలగ వచ్చు. ఇలా కర్మల గారడీ జరుగుతూ ఉంటుంది.

మనం పైన చెప్పిన శ్లోకం నుండి నేర్చుకోవాల్సిన అంశాలు.

మనము ధర్మం తెలుసుకొని కర్మయోగంతో కర్మలను ఆచరించాలి.

కర్మలు చేయకుండా ఎవరు తప్పించుకోలేరు. కాని ఆ కర్మలు శాస్త్రవిహితంగా చేయాలి.

కర్మలు చేసే అధికారం అందరికి ఉంది. కాని వాటిఫలితం మీద మాత్రం అధికారం లేదు.

కర్మల ఫలితం గురించి ఆలోచించకుండా కర్తవ్య బుద్ధితో మాత్రమే కర్మలు చేయాలి.
  
  



ఓం శ్రీ సాయి రామ్!

Saturday, January 19, 2019

సాయి బాట





మన సనాతన సంప్రదాయంలో గురూపదేశంకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువులు వారి శిష్యులకు ఒక మంత్రాన్ని ఉపదేశించి వారిని ఉద్దరించిడం జరిగింది. అయితే ఈ మంత్ర జపమే మనలను మోక్షానికి అనగా ఆత్మసాక్షార దిశగా తీసుకువెళ్తుందా ?

అలా అయితే ఎంతోమంది ఈ మార్గంలో మోక్షాన్ని పొంది ఉండవలసి ఉంది. కానీ అలా జరగడం లేదు.

ఎందుకు అంటే!
మన మనసు అంతర్ముఖం కానిదే, మనలో మార్పు రానిదే, మనం కామ క్రోధాలను వదలకుండా ఎన్ని రోజులు మంత్ర జపం చేసినా, మనలో జ్ఞాన పుష్పము విచ్చుకోకుండా మనం ఈ మోక్షం అనే గమ్యాన్ని చేరుకోలేము.

మరి అయితే మంత్ర జపం మనకు ఎలా ఉపయోగపడుతుంది. మన మనస్సు శుద్ధి పడడానికి సహకరిస్తుంది. అలా శుద్ధి పడిన మనస్సులో గురువు అనుగ్రహం ద్వారా లభించే జ్ఞానం వికసిస్తుంది. అప్పడుమాత్రమే ఒక సాధకుడు ఆత్మసాక్షార దిశగా ప్రయాణించ గలుగుతాడు.

ఈ విషయమే గురు గీతలో పరమాత్మ మనకు బోధించడం జరిగింది.

ధ్యానమూలం గురోర్మూర్తి: పూజా మూలం గురో: పదం !
మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో: కృపా !!

సర్వ దేవతలు గురువులోనే ఉంటే మన ధ్యానానికి గురు రూపం సరిపోదా!

మన పూజకు గురు పాదం కన్నా పూజ్యమైనది లేదు.

ఒక్క సారి మనకు గురువు సాకార రూపంలో దర్శనం ఇచ్చిన తర్వాత మనకు మంత్రాలతో పని లేదు. గురువు బోధలే మంత్రాలు కావాలి. గురు వాక్యమే మంత్రమని పరమశివుడు మనకు తెలియచేస్తున్నారు. గురు నామమే మంత్రం కావాలి.

కేవలం గురు కృపద్వారా మాత్రమే మోక్షం లభిస్తుంది అని గురు గీత గట్టిగా చెపుతుంది.



చాలామంది సాయి భక్తులు ఈ విషయాన్ని నమ్ముతారు. గురువు యొక్క ప్రాధాన్యతను సాయి చాలా చక్కగా వివరిస్తారు. గురువుని మించిన సాధన ఇంకోటి లేదు అని బాబా ఎప్పుడు చెపుతారు. ఇదే విషయాన్ని బాబా మనకు రాధాబాయి దేశముఖ్ ద్వారా చెప్పారు. సాయి అనుగ్రహ మాలికలో మనం ఈ విధంగా చెప్పుకున్నాము. 

రాధా భాయి ఉపవాసం ! కావాలన్నది ఒక మంత్రం !

బాబా చూపెను గురు మార్గం ! ఆమెకు కల్గెను మరిజ్ఞానం !!

ఈ సంఘటన గురించి మనం అందరం శ్రీ సాయి సత్చరితలో చదువుకున్నాము. 

సాఠే అనే ఒక పెద్దమనిషి వ్యాపారంలో దాదాపు అంతా పోగొట్టుకున్నాడు. మానసికంగా ఎంతో కృంగిపోయాడు. ఎవరో షిరిడికి వెళ్ళమని చెపితే వచ్చి బాబాను దర్శించాడు. గురు చరిత్ర పారాయణం చేశాడు. ఆ ఏడవ రోజు స్వప్నంలో బాబా గురుచరిత్రను వివరిస్తునట్లుగా చూశాడు. ఈ విషయం దీక్షిత్‌కు చెప్పగా అక్కడే ఉన్న హేమద్ మనసులో కలవరం మొదలయింది. ఈ సాఠే ఒక్కసారి పారాయణం చెయ్యగానే బాబా స్వప్న దర్శనం ఇచ్చారు. కాని నేను 40 ఏళ్ళుగా చేస్తున్నా నాకు ఎన్నడు ఇటువంటి అదృష్టము కలగలేదు అని అనుకున్నాడు. ఇది పసిగట్టిన బాబా హేమద్‌ను 15 రూపాయల దక్షిణ తెమ్మని శ్యామా ఇంటికి పంపించారు. ఆ తరువాత శ్యామా చెప్పే మాటలను జాగ్రత్తగా వినమన్నారు. ఆ తరువాత కథ మనము చదివిందే. శ్యామా 15 నమస్కారాలు దక్షిణగా ఇచ్చి రాధాభాయి దేశ్‌ముఖ్ కథ చెప్పారు. ఈ సంఘటన ద్వారా బాబా హేమద్‌కి చాలా విషయాలు నేర్పించారు. అవి ఏమిటో మనము ఇప్పుడు పరిశీలిద్దాము.

                మొట్టమొదటగా హేమద్‌కు ఆ రోజు ఒక నియమ భంగం కలిగింది. ఆయన రోజు భాగవతం పారాయణం చేస్తారు. కాని ఆ రోజు బాబా గోష్టిలో పాల్గొనాలి అని పారాయణం చేయకుండా మశీదుకు వెళ్తారు. శ్యామా ఇంటిలో ఉన్న భాగవత పుస్తకంలో సరిగ్గా అదే పుటను చూపించి తను ఎక్కడైతే పారాయణం ఆపాడో అక్కడే మరల చదివిస్తారు. ఇదే బాబా మనకు బోదిస్తున్న విషయం. మనము చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. మన ఆలోచనలు మనల్ని బానిసలుగా మార్చుకోకూడదు. తరువాత రాధాభాయి కథను మసీదులో బాబాకు హేమద్ వినిపిస్తాడు. అప్పుడు సాయి హేమద్‌కు ఈ విధంగా బోధచేస్తారు.

                ఆత్మజ్ఞానమే సమ్యక్ విజ్ఞానం. ఈ సమ్యక్ విజ్ఞానం ధ్యానం ద్వారానే సంభవం. ధ్యానమే ఆత్మానుష్టానం. దీని ద్వారా మనలోని చిత్తవృత్తులు అన్ని సమాధాన పడ్తాయి.ముందుగా నువ్వు ఈ సర్వ ఈషణలు  నుండి ముక్తుడవు అవ్వాలి. (ఇక్కడ ఈషణలు అంటే మనకు జీవితంలో కలిగే కోరికలు, తపనలు, ప్రేమానురాగాలు). తర్వాత సర్వ భూతస్థ ఆత్మను ధ్యానించాలి. (అంటే నిరాకార ధ్యానం) అప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇది కనక కష్టమైతే నా ఈ సగుణ రూపాన్ని ధ్యానించు. ఇలాచేస్తే నీ మనసు ఏకాగ్రమవుతుంది. నువ్వు బ్రహ్మంతో ఏకమవుతావు అని చక్కని బోధను బాబా హేమద్‌కు చేయడం జరిగింది. ఆ తరువాత బాబా వీటన్నింటిని చక్కగా శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా మహదానందాన్ని పొందవచ్చు అని చెప్పారు.

                సద్గురువులు మనకు ఎన్నోవిషయాలు చెప్పవచ్చు కాని అవి మన నిజజీవితంలోకి అన్వయించుకుంటేనే అవి మనకు ఉపయోగపడ్తాయి. ఇక్కడ రాధాభాయి కథ ద్వారా శ్రద్ధ, సబూరి అనే గొప్ప మంత్రాల్ని బాబా మనకు ఇచ్చారు. మనకు శాస్త్రాలు, ఉపనిషత్తులు బాగా తెలియవచ్చు. కాని నిజజీవితంలో మార్పులు రాకపోతే ఆ జ్ఞానం మనల్ని ముందుకు తీసుకువెళ్ళదు. ఇక్కడ హేమద్‌పంత్ యొక్క అంతర్ శత్రువులను బాబా వెలికి తీసుకువచ్చి ఒక్కొక్కటిగా పారద్రోలి, తను ముందు ముందు చేయించబోయే సత్కర్మలకు సిద్ధం చేసారు. అలానే బాబా మనలను కూడా ఈ దారిలో నడిపిస్తారు. 

సాయి బంధువులారా!
ధ్యానమూలం సాయి మూర్తి: పూజా మూలం సాయి పదం !
మంత్రమూలం సాయి వాక్యం  మోక్షమూలం సాయి కృపా !!

ఈ గురు గీత శ్లోకాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుందాము. 


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కు జై !